Team India: ఆఖరిసారి ఆడాలని ఉంది: డీకే
రాబోయే రెండు టీ20 ప్రపంచకప్లలో కనీసం ఒక్కసారైనా టీమ్ఇండియా తరఫున ఆడాలని ఉందని వెటరన్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో...
ఇంటర్నెట్డెస్క్: రాబోయే రెండు టీ20 ప్రపంచకప్లలో కనీసం ఒక్కసారైనా టీమ్ఇండియా తరఫున ఆడాలని ఉందని వెటరన్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను ఫిట్నెస్తో కొనసాగినంత కాలం క్రికెట్ ఆడతానని స్పష్టంచేశాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన ఈ సీనియర్ బ్యాట్స్మన్గా ఆటపై తనకింకా మక్కువ పోలేదని చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్లో విఫలమవ్వడం వల్లే తనని టీ20 జట్టు నుంచి తప్పించారన్నాడు.
‘నేను ఫిట్గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నా. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్లలో భారత్ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. 2019 వన్డే ప్రపంచకప్లో విఫలమైన నేపథ్యంలో టీమ్ఇండియా నుంచి తొలగించేవరకు నాకు ఆ టీ20 జట్టుతో మంచి అనుబంధం ఉంది’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. అలాగే రాబోయే ప్రపంచకప్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగే అవకాశముందని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 14వ సీజన్ రెండో భాగంలో మంచి ప్రదర్శన చేస్తే తుది జట్టులోకి ఎంపికయ్యే వీలుందని అన్నాడు.
‘నేనింకా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నా. టీమ్ఇండియాకు టీ20ల్లో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కావాలి. ఇప్పుడు జట్టు నిండా టాప్ఆర్డర్ బ్యాట్స్మెనే ఉన్నారు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా మినహా మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్మన్ లేరు. టాప్ ఆటగాళ్లంతా ఐపీఎల్లో ఆయా జట్లకు ఒకటి నుంచి మూడు స్థానాల్లోనే బ్యాటింగ్ చేస్తున్నారు. పంత్ ఒక్కడే నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. అలాంటప్పుడు రాబోయే ఐపీఎల్లో రాణిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది’ అని వెటరన్ బ్యాట్స్మెన్ తన అభిప్రాయం వెల్లడించాడు. ఇదిలా ఉండగా, 2004 నుంచి సుదీర్ఘకాలంగా టీమ్ఇండియాతో కొనసాగుతున్నా డీకే 2007 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2019 వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలోనే కెరీర్ ముగింపు దశలో ఉన్న అతడు చివరగా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తమ జట్లను ప్రకటించాయి. -
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి మద్దతు లభించింది. ఐపీఎల్ గతిని అది మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. -
దిల్లీ vs లఖ్నవూ.. ప్లేఆఫ్స్పై నేటి మ్యాచ్ ఫలితం ప్రభావమెంత?
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఒక్క జట్టు మాత్రమే ఇప్పటి వరకు క్వాలిఫై అయ్యింది. -
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
BCCI: టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. వేతనం, అర్హత వివరాలను వెల్లడించింది. -
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
ముంబయి ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో ఈ ఐపీఎస్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు హార్దిక్ నాయకత్వంపై ఆ జట్టు సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
టీ20 ప్రపంకప్ కోసం టీమ్ఇండియా రోహిత్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి