ODI WC 2023: నిర్వహణ లోపమా.. అనాసక్తా?
ప్రపంచకప్లో కంగారెత్తిస్తున్న ఖాళీ స్టేడియాలు
క్రికెట్ అంటే పడిచచ్చే భారత్లో ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI WC 2023). ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టేడియంలో తొలి మ్యాచ్. బీసీసీఐని అన్నీ తానై నడిపించే కార్యదర్శి జై షా సొంత నగరంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఆయన మద్దతుదారులు దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తొలి మ్యాచ్కు స్టేడియం చాలా వరకు నిండిపోతుందని.. జనాల కేరింతలతో తొలి మ్యాచ్ హోరెత్తిపోతుందని అంతా అంచనా వేశారు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్లేక స్టేడియం వెలవెలబోయింది. హైదరాబాద్లో జరిగిన రెండో మ్యాచ్కు సైతం ఇదే పరిస్థితి. ఇది నిర్వహణ లోపమా.. లేక ప్రపంచకప్ మీద జనాలకు ఆసక్తి తగ్గిపోతోందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడంతా టీ20లదే హవా అన్నది వాస్తవం. టెస్టులు, వన్డేలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతున్న మాట కూడా నిజమే. అలా అని ప్రపంచకప్లో సైతం వన్డేలను అభిమానులు లైట్ తీసుకుంటారని భావించడం లేదు. ఎందుకంటే గత మూడు వన్డే ప్రపంచకప్లకూ జనాదరణ తక్కువగా ఏమీ లేదు. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ సమయంలో అభిమానులు ఎలా వెర్రెత్తిపోయారో తెలిసిందే. భారత్ ఆడని మ్యాచ్లకు కూడా జనం బాగానే వచ్చారు. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన కప్, 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో కూడా స్టేడియాలు జనాలతో కళకళలాడాయి. గత కొన్నేళ్లలో వన్డేలకు ఆదరణ మరింత తగ్గినప్పటికీ.. ప్రపంచకప్, అందులోనూ భారత్లో జరిగే టోర్నీకి జనాలు బాగానే వస్తారని అంచనా వేశారు. బీసీసీఐ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హైప్ తీసుకొస్తుందని.. భారతేతర మ్యాచ్లకూ జనం వస్తారని భావించారు. కానీ తొలి మ్యాచ్ ఈ ఆశలపై నీళ్లు చల్లింది.
నిజానికి ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఆన్లైన్లో ఓపెన్ చేసినపుడు చకచకా అమ్ముడైపోయినట్లు వార్తలొచ్చాయి. తీరా చూస్తే మ్యాచ్ ఆరంభ సమయానికి లక్షా 20 వేల సామర్థ్యమున్న స్టేడియంలో పదో వంతు కూడా నిండలేదు. సాయంత్రానికి జనం పెరిగినా సగం కూడా ఫుల్ కాలేదు. ఈ మ్యాచ్ టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్ చేసి బీజేపీ నాయకులు సొంతం చేసుకున్నారట. అయితే వాళ్లు ఉచితంగా టికెట్లు పంచినా కూడా జనం మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రాలేదట. భారత్ మ్యాచ్ అయితే ఎగబడేవారు కానీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడటంతో అంతగా ఆసక్తి కనిపించలేదు. ఇక హైదరాబాద్లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్కు ఈ మాత్రం స్పందన కూడా లేదు. ఆరంభ సమయానికి ఉన్న జనం 5 వేల లోపే. అభిమానుల సంఖ్య అత్యధికంగా 8200కు మించలేదు. పాక్, ఆస్ట్రేలియా మధ్య కొన్ని రోజుల కిందట జరిగిన వార్మప్ మ్యాచ్కు ఇదే స్థాయిలో జనం వచ్చారు. అసలు మ్యాచ్కు మాత్రం ఆశించిన స్పందన లేదు.
కారణాలేంటి?
వన్డే మ్యాచ్లు అంటే మధ్యాహ్నం మొదలవుతాయి. పని దినాల్లో సెలవు పెట్టి మరీ మధ్యాహ్నం నుంచే మ్యాచ్లు చూడటానికి రావడం కష్టం. టీ20లు అంటే సాయంత్రం వచ్చి మూడు గంటలు ఎంజాయ్ చేసి వెళ్లిపోతారు. కానీ ఎనిమిది గంటల పాటు సాగే వన్డే మ్యాచ్లు చూసేందుకు ఈ రోజుల్లో జనాలకు ఓపిక ఉండట్లేదు. గతంలో అంటే వన్డేలకు ఆకర్షణ వేరుగా ఉండేది. టీ20లు వచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రపంచకప్ అన్నా సరే.. వేరే జట్లు తలపడితే టికెట్లు పెట్టుకుని స్టేడియాలకు వెళ్లాలన్నంత ఆసక్తి జనాల్లో కనిపించడం లేదు. దీనికి తోడు ఈసారి నిర్వహణ లోపాలు కూడా ఉన్న మాట వాస్తవం అంటున్నారు విశ్లేషకులు.
ప్రపంచకప్నకు సరైన ప్రచారం కల్పించడంలో, అభిమానుల్లో ఉత్సాహం పెంచడంలో ఐసీసీ, బీసీసీఐ విఫలమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. టికెట్ల అమ్మకాలు ఆలస్యం చేయడం, వాటి నిర్వహణ కూడా సరిగా లేకపోవడం కూడా ప్రతికూలమైనట్లు కనిపిస్తోంది. ప్రపంచకప్ ఆరంభ సమయానికి ఆసియా క్రీడలు జరుగుతుండటం వల్ల పూర్తి స్థాయిలో టోర్నీ మీద అభిమానులు, మీడియా దృష్టిపెట్టకపోవడానికి ఓ కారణమే. టోర్నీలో భారత్ మ్యాచ్ మొదలైతే వచ్చే ఊపే వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం చెన్నైలో తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది భారత్. ఆ మ్యాచ్ టికెట్లకు డిమాండ్ మామూలుగా లేదు. వెయ్యి రూపాయల టికెట్ బ్లాక్లో రూ.25 వేలు పలుకుతోందట. ఆపై శనివారం భారత్-పాక్ మ్యాచ్కైతే 50 వేలు పెట్టినా టికెట్ దొరికే పరిస్థితి లేదు. తొలి మ్యాచ్కు వెలవెలబోయిన మోడీ స్టేడియం ఆ రోజు నిండుగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఒకసారి భారత్ మ్యాచ్ జరిగితే.. కొన్ని ఉత్కంఠభరిత పోరాటాలు చూస్తే అభిమానుల్లో ఉత్సాహం రావచ్చు. అలాగే వారాంతాల్లో ఆసక్తికర మ్యాచ్లు ఉంటే స్పందన బాగానే ఉంటుందని ఆశిస్తున్నారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు