Shreyas Iyer: శ్రేయస్ ‘షార్ట్’ టెంపర్.. ఆ బలహీనతే బౌలర్లకు ఆయుధం..!
టీమ్ ఇండియా నంబర్-4 సమస్య మళ్లీ మొదటికొచ్చే పరిస్థితి నెలకొంది. ఈ స్థానం కోసం జట్టులోకి వచ్చిన అయ్యర్ (Shreyas Iyer) షార్ట్పిచ్ బాల్స్ సిండ్రోమ్ నుంచి బయటపడటంలేదు. అతడి కెరీర్లోనే అది ఓ భయంకరమైన బలహీనతగా మారే ప్రమాదం ఉంది.
ఇంటర్నెట్డెస్క్: టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రధాన సమస్య ‘నంబర్-4’..! శ్రేయస్ అయ్యర్ ((Shreyas Iyer))గాయం నుంచి కోలుకొని రావడంతో ఈ స్థానానికి ఇబ్బందిలేదని జట్టు మేనేజ్మెంట్ భావించింది. కానీ, టోర్నీ మొదలయ్యాక మాత్రం పరిస్థితి తారుమారైంది. ఆరు మ్యాచ్లు ఆడి కేవలం 134 పరుగులు చేశాడు. టోర్నీలో టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న సమయాల్లో ఆదుకొన్న ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు. వీటన్నింటికి మించి పదేపదే షార్ట్పిచ్ బంతులను పుల్ చేసేందుకు ప్రయత్నించి వికెట్లను సమర్పించుకోవడం ఆందోళనకరంగా మారింది. ఆసీస్ సీమర్ హేజిల్వుడ్, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, ఇంగ్లిష్ బౌలర్ వోక్స్ ఇప్పటికే శ్రేయస్ బలహీనతను వాడుకొన్నారు.
శ్రేయస్ కెరీర్లో దేశీయంగా జరిగిన వన్డేల్లో 8 సార్లు ఇలానే అవుటయ్యాడు.. ఇక విదేశీ వేదికలపై 6 సార్లు వికెట్ను సమర్పించుకొన్నాడు. అంటే వన్డేల్లో మొత్తంగా 48 ఇన్నింగ్సుల్లో 5 సార్లు నాటౌట్గా నిలిచాడు. ఇక 14సార్లు.. అంటే కెరీర్లో దాదాపు మూడో వంతు పుల్షాట్లకు యత్నించే పెవిలియన్కు చేరాడు. ఇంత పెద్ద లోపాన్ని ప్రత్యర్థి బౌలర్లు గమనించలేదనుకుంటున్నాడో ఏమో.. కీలకమైన ప్రపంచకప్లో కూడా ఇలానే మూడుసార్లు వికెట్లను పోగొట్టుకున్నాడు.
ఇప్పుడు అయ్యర్ (Shreyas Iyer) స్థానానికి సెగ..
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా, పేలవ ప్రదర్శనతో శార్దూల్ జట్టులో స్థానం కోల్పోవడంతో.. రిజర్వు బెంచ్పై కాలం గడపుతున్న టీ20 సూపర్ స్టార్ సూర్య జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్లో దురదృష్టవశాత్తు రనౌట్ అయినా.. ఇంగ్లాండ్పై మ్యాచ్లో మాత్రం బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. దీంతో జట్టు చాలా బ్యాలెన్స్గా కనిపించింది. ఇప్పుడు హర్దిక్ తిరిగి జట్టులో చేరితో ఫామ్లో లేని శ్రేయస్ను రిజర్వ్ బెంచ్కు పరిమితం చేసి సూర్యాను నంబర్-4గా ప్రమోట్ చేయాలని గావస్కర్ వంటి సీనియర్లు సూచించడం మొదలుపెట్టారు.
సీనియర్లు ఏమంటున్నారంటే..
టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయ్యర్కు కొన్ని సలహాలిచ్చాడు. షార్ట్ బంతి వేస్తే పుల్షాట్ కొట్టాలని అయ్యర్ ముందుగానే సిద్ధంగా ఉండటం సమస్యకు కారణమని పేర్కొన్నాడు. ముందు అతడి మైండ్సెట్ను మార్చుకోవాలని పేర్కొన్నాడు.‘‘నెట్స్లో సాధన చేసినట్లే ఆడాలనేమీ లేదు.. అతడు మాత్రం అలానే ఆడాలని యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అతడు షార్ట్ బాల్స్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నాడే గానీ.. ముందుకెళ్లి బంతిని అతడి నియంత్రణలో ఉంచుకొంటూ.. సాధ్యమైనంత ఎత్తు వరకే పుల్ చేయడంలేదు. తాజా మ్యాచ్లో చూడండి.. ప్రతి బంతిని పుల్ చేయాలని చూస్తున్నాడు.. అంతర్జాతీయ ఆటగాళ్ల బౌలింగ్లో మీరు అలా చేయకూడదు. మీరు పూర్తిగా నియంత్రణలో ఉంచుకోగలిగిన వాటినే పుల్ చేయాలి’’ అని గంభీర్ విశ్లేషించాడు.
ఇక పాక్ మాజీ ఆటగాడు మిస్బా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. అయ్యర్ తరచూ షార్ట్ బాల్స్ ఆశిస్తాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. షార్ట్-ఆఫ్-లెంగ్త్ బంతులను కూడా పుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. అస్సలు వీటిని పుల్ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నాడు. షార్ట్బాల్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమస్యల్లో పడ్డట్లే అని పేర్కొన్నాడు. షార్ట్బాల్స్ ఆడే సమయంలో అతడి ఫుట్వర్క్ కూడా మెరుగుపడాలన్నాడు.
గతంలో రైనా కూడా ఇంతే..
వైట్బాల్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో రైనా ఒకడు. ఐపీఎల్ టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్నాడు. కానీ, కెరీర్లో అత్యధిక కాలం శ్రేయస్ వలే షార్ట్బాల్స్ ఆడటంతో తీవ్ర అవస్థలు పడ్డాడు. అతడి బలహీనతను ప్రత్యర్థి బౌలర్ల తరచూ వాడుకొని దెబ్బతీసేవారు. దీనిని అధిగమించేందుకు అతడు గంగూలీతో కలిసి పనిచేసినా.. పూర్తిగా సాధ్యం కాలేదు. ముఖ్యంగా ‘సెనా’ (SENA) దేశాల పిచ్లపై అతడు తీవ్రంగా అవస్థలు పడ్డాడు. తాజాగా ఇప్పుడు శ్రేయస్ వంటి ఆటగాడు షార్ట్బాల్స్కు అవస్థలు పడుతున్నాడు. కానీ, కెప్టెన్ రోహిత్ మాత్రం అయ్యర్కు బలమైన మద్దతుదారుగా ఉన్నాడు. గతంలో ఓ ఆంగ్ల పత్రిక వద్ద రోహిత్ మాట్లాడుతూ ‘‘శ్రేయస్ గాయపడటంతో జట్టులో 4వ స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించాము. కానీ, వారు అవకాశాలను అందిపుచ్చుకోలేదు. కానీ, శ్రేయస్ తిరిగి జట్టులోకి వచ్చాక నా సమస్యలు తీరతాయి’’ అని పేర్కొన్నాడు. దీంతో అయ్యర్ కుదురుకొనేందుకు తగినంత సమయాన్ని రోహిత్ ఇచ్చే అవకాశాలున్నాయి. దీనిని అయ్యర్ వాడుకొని షార్ట్బాల్ సిండ్రోమ్ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్