IND vs SL: ఇంకొక్క అడుగు
ఆరుకు ఆరు విజయాలు.. వన్డే ప్రపంచకప్లో ఒకే ఒక్క అజేయ జట్టు మనదే. ఇప్పటికే దాదాపుగా సెమీస్ చేరినట్లే. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే ఇంకొక్క అడుగు వేయాలి. ఆ అడుగు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
నేడు లంకతో భారత్ పోరు
గెలిస్తే అధికారికంగా సెమీస్కు
మధ్యాహ్నం 2 నుంచి
ముంబయి
ఆరుకు ఆరు విజయాలు.. వన్డే ప్రపంచకప్లో ఒకే ఒక్క అజేయ జట్టు మనదే. ఇప్పటికే దాదాపుగా సెమీస్ చేరినట్లే. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే ఇంకొక్క అడుగు వేయాలి. ఆ అడుగు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి మేటి జట్లు విసిరిన సవాళ్లను కూడా కాచుకుని విజయాలు సాధించిన టీమ్ఇండియా.. ఇప్పుడిక బలహీన శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో ఘనవిజయం, దాంతో పాటు సెమీస్ బెర్తు సొంతమైనట్లే.
ప్రపంచకప్లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క ఓటమీ లేకుండా సెమీస్కు అత్యంత చేరువగా వచ్చిన టీమ్ఇండియా.. నాకౌట్ బెర్తును అధికారికంగా సొంతం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. గురువారం రోహిత్ సేన.. శ్రీలంకను ఢీకొనబోతోంది. ఆరు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడి సెమీస్ రేసులో బాగా వెనుకబడింది లంక. చివరి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడటం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బ తీసేదే.
శ్రేయస్ అందుకుంటాడా?: టోర్నీ ముందుకు సాగేకొద్దీ టీమ్ఇండియా బలం పెరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లందరూ ఊపందుకున్నారు. హార్దిక్ పాండ్య దూరం కావడంతో కూర్పు మారి తుది జట్టులో అవకాశం దక్కించుకున్న ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమి, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం సత్తా చాటారు. కానీ ఒక్క శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీలో ఆరు మ్యాచ్లాడిన శ్రేయస్ 134 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకమే ఉంది. గత మ్యాచ్లో ఇంగ్లాండ్పై జట్టు కష్టాల్లో ఉండగా అవసరం లేని షాట్ ఆడి వెనుదిరగడంతో శ్రేయస్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. లంకపై సత్తా చాటకపోతే.. ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తుంది. ఓపెనర్ శుభ్మన్ మంచి లయలోనే కనిపిస్తున్నా అతను కూడా భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లి ఇంగ్లాండ్పై డకౌటైనా.. టోర్నీలో తన ఫామ్ బాగుంది. రాహుల్ కూడా మిడిలార్డర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్కు అనుకూలించే వాంఖడె పిచ్పై భారీ స్కోరు చేయడానికి భారత్కిది మంచి అవకాశమే. బౌలింగ్లో భారత్కు పెద్ద సమస్యలేమీ లేవు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి చెలరేగిపోతుంటే.. బుమ్రా, కుల్దీప్, జడేజా నిలకడను కొనసాగిస్తున్నారు. సిరాజ్ స్థానంలో ఈ మ్యాచ్లో అశ్విన్ను ఆడించే అవకాశం లేకపోలేదు.
లంక నిలుస్తుందా?: ఆరు మ్యాచ్లాడి రెండే నెగ్గిన లంక.. ఈ మ్యాచ్లో ఓడితే సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే అవుతుంది. టోర్నీలో ఇంగ్లాండ్ను ఓడించడం మినహా ఆ జట్టు ప్రదర్శన పేలవమే. కెప్టెన్ శానకతో పాటు పతిరన, కుమార గాయాలతో దూరం కావడం జట్టును దెబ్బ తీసింది. మిగతా ఆటగాళ్లలో నిలకడ కొరవడింది. ఆరంభంలో అదరగొట్టిన కుశాల్ మెండిస్.. శానక స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాక రాణించలేకపోతున్నాడు. నిశాంక పర్వాలేదు. ధనంజయ డిసిల్వా ఆల్రౌండ్ పాత్రలో తేలిపోతున్నాడు. బౌలింగ్లో తీక్షణ నిరాశ పరుస్తున్నాడు. భారత్తో మ్యాచ్లో వీళ్లెలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. టోర్నీలో సత్తా చాటుతున్న పేసర్ మదుశంకతో పాటు ఆలస్యంగా జట్టులోకి వచ్చిన మాథ్యూస్ మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్మన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమి, బుమ్రా, సిరాజ్/ అశ్విన్.
శ్రీలంక: నిశాంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్ (కెప్టెన్), సమరవిక్రమ, అసలంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తీక్షణ, చమీర, మదుశంక, రజిత.
పరుగుల పండగేనా?
వాంఖడె పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్కు అనుకూలం. ప్రస్తుత ప్రపంచకప్లో కూడా బ్యాటర్లకు అత్యంత సహకరిస్తున్న పిచ్ ఇదే. ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా వరుసగా 399, 382 పరుగులు చేసింది. గురువారం కూడా వికెట్ భిన్నంగా ఏమీ ఉండదని అంచనా. మొదట ఎవరు బ్యాటింగ్ చేసినా 300 దాటడం ఖాయం కావచ్చు. భారత్ మొదట బ్యాటింగ్ చేసి, మన స్టార్ బ్యాటర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే 350-400 మధ్య స్కోరు నమోదు చేయొచ్చు. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది.
7
వన్డేల్లో మాథ్యూస్ బౌలింగ్లో రోహిత్ శర్మ ఔటైన సందర్భాలు. అందులో రెండు డకౌట్లున్నాయి. మరే బౌలరూ అతణ్ని ఈ ఫార్మాట్లో ఇన్నిసార్లు ఔట్ చేయలేదు. మాథ్యూస్ బౌలింగ్లో రోహిత్ సగటు 14.71 మాత్రమే.
9
ప్రపంచకప్లో భారత్, శ్రీలంక తలపడ్డ మ్యాచ్లు. చెరో నాలుగు విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు.
34
ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లికి అవసరమైన పరుగులు. అది సాధిస్తే అత్యధికసార్లు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ (11) సరసన నిలుస్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?