Dhruv Jurel: ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూసుకుపోతోంది. ఇప్పటికే తొమ్మిది మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన ఆర్ఆర్ ప్లేఆఫ్స్కు చేరువైంది. తాజాగా లఖ్నవూపై అలవోకగా విజయం సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్తోపాటు (71*) ధ్రువ్ జురెల్ (52*) అజేయంగా నిలిచి గెలిపించాడు. ఐపీఎల్ కెరీర్లో తొలి అర్ధశతకాన్ని సాధించిన తర్వాత ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) భావోద్వేగంతో ఒకరికి సెల్యూట్ చేశాడు. ఇంతకీ ఆ స్పెషల్ వ్యక్తి ఎవరనేది మ్యాచ్ అనంతరం ధ్రువ్ వెల్లడించాడు.
‘‘మ్యాచ్ను ముగించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకొనేందుకు ఇష్టపడను. మిడిలార్డర్లో ఆడటం వల్ల మరింత బాధ్యత మనపై ఉంటుంది. చివరి వరకూ క్రీజ్లో ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించే అవకాశం వస్తుంది. పవర్ ప్లేలో కేవలం ఇద్దరు మాత్రమే సర్కిల్ అవతల ఉంటారు. సులువుగానే పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, మిడిల్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లను దాటి బౌండరీ పంపించాలంటే చాలా శ్రమించాలి. టెక్నిక్తోపాటు టైమింగ్ ముఖ్యం. మొదట్లో నేను కొట్టిన బంతులు నేరుగా ఫీల్డర్ల వద్దకే వెళ్లాయి. ఆ సమయంలో సంజూ ధైర్యం చెప్పాడు. మరీ బాదుడు కాకుండా టైమింగ్తో ఆడమని సూచించాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో 20 పరుగులు చేయడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. నేను భారత జట్టులో ఆడుతోంది నా తండ్రి కోసం. మా కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో ఆడేటప్పుడు నాతోపాటు లేరు. ఆర్మీలో విధులు నిర్వర్తించారు. ఇప్పుడు హాఫ్ సెంచరీ చేసిన సమయంలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. అర్ధశతకం చేసిన తర్వాత ఆయనకే సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసుకున్నా’’ అని ధ్రువ్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ధ్రువ్ సంబరాలు చేసుకున్నాడు. వారితో ఫొటోలు దిగాడు. ఈ వీడియోను ఐపీఎల్ షేర్ చేసింది.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో రాజస్థాన్ ఛేదించిన అత్యధిక టార్గెట్స్లో ఇది ఐదోది. 2020లో పంజాబ్పై, 2024 సీజన్లో కోల్కతాపై ఆర్ఆర్ 224 పరుగులను ఛేదించి గెలిచింది. ఇప్పుడు లఖ్నవూపై 197 పరుగుల టార్గెట్ను పూర్తి చేసింది.
- ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం చేసిన జోడీగా సంజూ శాంసన్ - ధ్రువ్ జురెల్ నిలిచింది. వీరిద్దరూ కలిసి లఖ్నవూపై 121 పరుగులను జోడించారు.
- లఖ్నవూ 2022, 2023 సీజన్లలో మొత్తం 15 మ్యాచ్లకుగాను 12 మ్యాచుల్లో లక్ష్యాలను కాపాడుకొని విజయం సాధించింది. రెండు ఓటములను మాత్రమే చవిచూసింది. ఒకదాంట్లో ఎలాంటి ఫలితం రాలేదు. కానీ, 2024 ఎడిషన్లో మాత్రం ఆరు మ్యాచుల్లో మూడింట్లో గెలవడం గమనార్హం. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది.
- ఏక్నా మైదానంలో పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్లు నమోదైన నాలుగో మ్యాచ్ ఇది. శ్రీలంకతో 2022లో జరిగిన మ్యాచ్లో భారత్ 199/2 స్కోరు చేసింది.
- తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు లఖ్నవూ చేసిన అత్యధిక జట్టు స్కోర్ల జాబితాలో ఇది ఐదోది. గతేడాది పంజాబ్పై 257/5 స్కోరు చేయగా.. కోల్కతాపై (2022లో) 210/0 చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు