ICC Rules: క్రికెట్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ఐసీసీ.. అవేంటంటే?
క్రికెట్ను రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ (ICC) కొత్త రూల్స్ను తీసుకొస్తూ ఉంటుంది. మైదానంలో ఇరు జట్లకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిబంధనలను అమలు చేస్తుంటుంది.
(ఫొటో సోర్స్: యూట్యూబ్)
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటికప్పుడు క్రికెట్ ఆటను ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ (ICC) నిరంతరం రూల్స్ని సమీక్షిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ జట్లకు సమాన అవకాశాలు ఉండేలా అవసరమైనప్పుడు రూల్స్ను మారుస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి రూల్ను తీసుకొచ్చింది. ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు చెబుతున్న ఆ రూల్ ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్టంపింగ్ కోసం అప్పీలు చేసినప్పుడు స్టంప్ ఔట్ కోసం మాత్రమే చెక్ చేస్తారు. గతంలో స్టంపౌట్ కోసం ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేసినప్పుడు స్టంపింగ్తోపాటు క్యాచ్నూ చెక్ చేసి ఫలితం ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల డీఆర్ఎస్ను తీసుకోకుండా ఫీల్డింగ్ జట్టు లబ్ధి పొందుతుందనే విమర్శలు వచ్చాయి. అందుకే ఐసీసీ ఇప్పుడు కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఒకవేళ క్యాచ్ మీద ఏదైనా అనుమానం ఉంటే డీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది.
కంకషన్ నిబంధనలో స్వల్ప మార్పు..
కంకషన్ నిబంధనలో చిన్న మార్పులను ఐసీసీ చేసింది. ఇప్పటి వరకు ఏ ఆటగాడి స్థానంలోనైనా కంకషన్ ప్లేయర్ వస్తే నేరుగా బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కానీ, ఇక నుంచి కంకషన్కు గురైన ఆటగాడు ఆ మ్యాచ్లో బౌలింగ్ నుంచి నిషేధానికి గురైతే సబ్స్టిట్యూట్గా వచ్చే వ్యక్తికి బౌలింగ్ చేసే అవకాశం ఉండదు.
నో బాల్ రూల్.. టైమ్ లిమిట్
ఇప్పటి వరకు ఫుట్ నోబాల్ను థర్డ్ అంపైర్ ఇస్తున్నాడు. ఇక నుంచి దానితోపాటు అన్ని రకాల ఫుట్కు సంబంధించిన నో-బాల్స్ను థర్డ్ అంపైర్ చెక్ చేసి ఇవ్వాలి. రిటర్న్ క్రీజ్ను టచ్ చేసి బౌలింగ్ చేసినా దానిని నో బాల్గా ప్రకటించాల్సి ఉంటుంది. మైదానంలో గాయపడిన ఆటగాడికి వెంటనే వైద్యసాయం అందిస్తారు. అయితే, ఇక నుంచి దానికి టైమ్ లిమిట్ ఉంటుంది. వైద్యసాయం కోసం నాలుగు నిమిషాల వరకు సమయం కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు