Rohit Sharma: ట్రోఫీ రాకుంటే.. ఎన్ని సెంచరీలు కొట్టినా వృథానే: రోహిత్ శర్మ
క్రికెట్ ఆటలో వ్యక్తిగత ప్రదర్శన కంటే టీం వర్క్ చాలా ముఖ్యమని అన్నాడు హిట్మ్యాన్ రోహిత్ శర్మ. జట్టు ట్రోఫీ గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని శతకాలు
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ ఆటలో వ్యక్తిగత ప్రదర్శన కంటే టీం వర్క్ చాలా ముఖ్యమని అన్నాడు హిట్మ్యాన్ రోహిత్ శర్మ. జట్టు ట్రోఫీ గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని శతకాలు కొట్టినా వాటికి అర్థమే ఉండదన్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీని పేలవ ప్రదర్శనతో ఆరంభించిన టీమిండియా.. బుధవారం అఫ్గానిస్థాన్పై దంచికొట్టి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్, రాహుల్ అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన రోహిత్.. తాజాగా ఐసీసీ అధికారిక సోషల్మీడియా ఖాతాలో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
‘‘2016 నుంచి ఇప్పటివరకు ఎంతో అనుభవాన్ని పొందాను. అప్పటితో పోలిస్తే బ్యాట్స్మన్గా మరింత పరిణతి చెందాను. ఆటను అర్థం చేసుకుంటూ, జట్టు ఏం కోరుకుంటుందో తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రికెటర్గా జట్టుకే అధిక ప్రాధాన్యమివ్వాలి. జట్టుకు ఏం అవసరమో తెలుసుకోవాలి. ఒక షాట్ ఆడే ముందు అది ఆ సమయంలో జట్టుకు అవసరమా? లేదా? అన్నది ఆలోచించుకోవాలి. అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఓపెనర్ల విషయానికొస్తే.. ఇన్నింగ్స్ మొదలుపెట్టేవారికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది. అందుకే, టీ20ల్లో ఎక్కువ శతకాలు టాప్ ఆర్డర్ బ్యాట్మెనే సాధించగలుగుతారు. నేను కూడా అంతే’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆట తీరు మారిందని, అందుకే చాలా మంది సెంచరీలు కొట్టేస్తున్నారని రోహిత్ అన్నాడు. బ్యాట్స్మెన్ ఎలాంటి భయం లేకుండా బంతులను ఎదుర్కొంటున్నారని, అది ఒక రకంగా అన్ని జట్లకు కలిసొస్తున్న అంశమన్నాడు.
ఈ సందర్భంగా 2019 వన్డే ప్రపంచకప్ నాటి సంగతులను కూడా రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ‘‘2019 ప్రపంచకప్ నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. ఆ టోర్నీలో నేను చాలా పరుగులు సాధించాను. ప్రతి ఆటగాడు టోర్నీకి వెళ్లే ముందు ఒక ప్లాన్ వేసుకుంటాడు. అది ఫాలో అవుతాడు. నేనూ అదే చేసి ఎక్కువ పరుగులు రాబట్టాను. అయితే నిజాయతీగా చెప్పాలంటే జట్టు ట్రోఫీ గెలవనప్పుడు ఆటగాడిగా ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని శతకాలు సాధించినా అవన్నీ వృథానే కదా’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
అమ్మ కోసం.. జెర్సీ నం. 45
టీమిండియాకు అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ ఎప్పుడూ 45వ జెర్సీ నంబరుతోనే కన్పిస్తుంటాడు. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందట. ఆ విషయాన్ని తాజాగా హిట్మ్యాన్ బయటపెట్టాడు. అమ్మ కోరిక మేరకే ఆ నంబరును ఎంచుకున్నట్లు చెప్పాడు. ‘‘45వ నంబరు ఎందుకంటే.. ఆ సంఖ్య మా అమ్మకు ఇష్టం. జట్టులోకి వచ్చినప్పుడు చాలా జెర్సీ నంబర్లు ఉన్నాయి. ఏ నంబరు ఎంచుకోవాలని మా అమ్మను అడిగా. 45 అయితే నీకు మంచిదని చెప్పింది. అందుకే ఆ నంబరు తీసుకున్నా’’ అని రోహిత్ వివరించాడు.
అఫ్గాన్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా శుక్రవారం స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లో ఘోర పరాభవాన్ని చవిచూడటంతో మిగతా మ్యాచ్లన్నీ భారత జట్టుకు కీలకంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
కీలక మ్యాచ్లో లఖ్నవూ పోరాడి ఓడింది. దిల్లీ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. -
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తమ జట్లను ప్రకటించాయి. -
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి మద్దతు లభించింది. ఐపీఎల్ గతిని అది మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. -
దిల్లీ vs లఖ్నవూ.. ప్లేఆఫ్స్పై నేటి మ్యాచ్ ఫలితం ప్రభావమెంత?
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఒక్క జట్టు మాత్రమే ఇప్పటి వరకు క్వాలిఫై అయ్యింది. -
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
BCCI: టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. వేతనం, అర్హత వివరాలను వెల్లడించింది. -
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
ముంబయి ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో ఈ ఐపీఎస్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు హార్దిక్ నాయకత్వంపై ఆ జట్టు సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
టీ20 ప్రపంకప్ కోసం టీమ్ఇండియా రోహిత్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక