Shreyas Iyer - BCCI: శ్రేయస్ బలిపశువు అయ్యాడా? బీసీసీఐ నిర్ణయంపై కొనసాగుతున్న చర్చ!
శ్రేయస్ అయ్యర్ వార్షిక కాంట్రాక్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విషయంలో చర్చ కొనసాగుతోంది. బీసీసీఐ నిర్ణయం సరైనదేనా అంటూ చర్చ జరుగుతోంది.
దేశవాళీ క్రికెట్ను యువ ఆటగాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో.. అందరికీ ఒక హెచ్చరిక జారీ చేసేలా రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించడం భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ వ్యవహారంలో శ్రేయస్ అయ్యర్ బలిపశువు అయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతడి పట్ల బీసీసీఐ అంత కఠినంగా వ్యవహరించి ఉండాల్సింది కాదనే చర్చ జరుగుతోంది.
టీమ్ ఇండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీని పట్టించుకోకపోవడం కొత్తగా జరుగుతున్నది కాదు. దశాబ్దాల నుంచి స్టార్ ఆటగాళ్లు ఈ దేశవాళీ అత్యున్నత టోర్నీని తేలిగ్గా తీసుకుంటున్నారు. భారత జట్టులో కొంచెం నిలదొక్కుకున్నారంటే ఇక దేశవాళీ క్రికెట్ గురించి మరిచిపోవడమే. అందులోనూ టీ20ల రాకతో అంతర్జాతీయ సిరీస్ల సంఖ్య పెరిగిపోయింది. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడుతూ.. ఐపీఎల్ కోసం రెండు నెలలు కేటాయిస్తూ దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడటం అంటే కుదిరే పని కాదు. ఐతే తీరిక లేకుండా క్రికెట్ ఆడే సీనియర్ ఆటగాళ్ల సంగతి పక్కన పెడితే.. యువ ఆటగాళ్లు కూడా రంజీ ట్రోఫీని లైట్ తీసుకుంటుండడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది.
బీసీసీఐకి ఇంత ఆగ్రహం రావడానికి ముఖ్య కారణం.. ఇషాన్ కిషన్. రెండు నెలల కిందట దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలు సాకుగా చూపినా.. తుది జట్టులో చోటు దక్కనందుకు కినుక వహించే అతను వచ్చేసినట్లు సమాచారం. ఐతే అతణ్ని ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేయలేదు. భారత జట్టుకు దూరంగా ఉన్నాడు కాబట్టి రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్కు ఆడాలని బీసీసీఐ నుంచి అతడికి ఆదేశాలు అందాయి. అతను పెడచెవిన పెట్టాడు. మరోవైపు ఇంగ్లాండ్తో సిరీస్లో రెండో మ్యాచ్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు కూడా బోర్డు నుంచి ఇలాంటి ఆదేశాలే రాగా.. పట్టించుకోలేదట. అందుకే ఇప్పుడు వీళ్లిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించారు.
శ్రేయస్ కథ వేరు..
ఇషాన్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ దగ్గర యాటిట్యూడ్ చూపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ శ్రేయస్ వ్యవహారం వేరు. అతను ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అది ఫామ్ మీద కూడా ప్రభావం చూపింది. దీంతో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. అతను ఫిట్నెస్ సమస్యలతో వైదొలిగాడా.. సెలక్టర్లు వేటు వేశారా అనే విషయంలో స్పష్టత లేదు. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో కొంత విశ్రాంతి అవసరమైంది. ఆ సమయంలోనే రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డు నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
అతను వెంటనే ఆ టోర్నీలో బరిలోకి దిగలేదు. కానీ సెమీస్ మ్యాచ్లో ముంబయికి ఆడాడు. పదో తేదీ నుంచి విదర్భతో జరగబోయే రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా ఆడతాడని సమాచారం. అయితే ఇప్పుడు అతణ్ని సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించారు. ఇషాన్ ఒక్కడిని లక్ష్యంగా చేసుకుంటే బాగోదని, సమస్య తీవ్రతను పెంచి చూపడానికి శ్రేయస్ను కూడా కలిపి బీసీసీఐ చర్యలు తీసుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన శ్రేయస్ లాంటి ఆటగాడితో బీసీసీఐ మరీ ఇంత కఠినంగా వ్యవహరించాల్సింది కాదని.. ఈ వ్యవహారంలో బలిపశువు అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తీసిపడేసే ఆటగాడు కాదు
శ్రేయస్ అయ్యర్ 59 వన్డేలు, 51 టీ20లు, 14 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో కొన్నేళ్లుగా రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఆ ఫార్మాట్లో 5 సెంచరీలు కూడా చేశాడు. గత ఏడాది ప్రపంచకప్లో వరుసగా రెండు అర్ధశతకాలు, రెండు శతకాలు సాధించాడు. ఇటీవల, ముఖ్యంగా టెస్టుల్లో ఫామ్తో కొంత తంటాలు పడుతున్న మాట వాస్తవం. కానీ అతణ్ని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్న సంగతీ మరువరాదు. ఈ నేపథ్యంలో శ్రేయస్కు ఒక హెచ్చరిక జారీ చేసి సరిపెట్టి ఉండాల్సిందని.. మూడు ఫార్మాట్లో భారత్కు ఆడుతున్న కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన శ్రేయస్ను చిన్న పొరబాటుకు సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించడం అన్యాయం అనే వాదన వినిపిస్తోంది.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత