Shreyas Iyer - BCCI: శ్రేయస్ బలిపశువు అయ్యాడా? బీసీసీఐ నిర్ణయంపై కొనసాగుతున్న చర్చ!
శ్రేయస్ అయ్యర్ వార్షిక కాంట్రాక్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విషయంలో చర్చ కొనసాగుతోంది. బీసీసీఐ నిర్ణయం సరైనదేనా అంటూ చర్చ జరుగుతోంది.
దేశవాళీ క్రికెట్ను యువ ఆటగాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో.. అందరికీ ఒక హెచ్చరిక జారీ చేసేలా రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించడం భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ వ్యవహారంలో శ్రేయస్ అయ్యర్ బలిపశువు అయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతడి పట్ల బీసీసీఐ అంత కఠినంగా వ్యవహరించి ఉండాల్సింది కాదనే చర్చ జరుగుతోంది.
టీమ్ ఇండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీని పట్టించుకోకపోవడం కొత్తగా జరుగుతున్నది కాదు. దశాబ్దాల నుంచి స్టార్ ఆటగాళ్లు ఈ దేశవాళీ అత్యున్నత టోర్నీని తేలిగ్గా తీసుకుంటున్నారు. భారత జట్టులో కొంచెం నిలదొక్కుకున్నారంటే ఇక దేశవాళీ క్రికెట్ గురించి మరిచిపోవడమే. అందులోనూ టీ20ల రాకతో అంతర్జాతీయ సిరీస్ల సంఖ్య పెరిగిపోయింది. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడుతూ.. ఐపీఎల్ కోసం రెండు నెలలు కేటాయిస్తూ దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడటం అంటే కుదిరే పని కాదు. ఐతే తీరిక లేకుండా క్రికెట్ ఆడే సీనియర్ ఆటగాళ్ల సంగతి పక్కన పెడితే.. యువ ఆటగాళ్లు కూడా రంజీ ట్రోఫీని లైట్ తీసుకుంటుండడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది.
బీసీసీఐకి ఇంత ఆగ్రహం రావడానికి ముఖ్య కారణం.. ఇషాన్ కిషన్. రెండు నెలల కిందట దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలు సాకుగా చూపినా.. తుది జట్టులో చోటు దక్కనందుకు కినుక వహించే అతను వచ్చేసినట్లు సమాచారం. ఐతే అతణ్ని ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేయలేదు. భారత జట్టుకు దూరంగా ఉన్నాడు కాబట్టి రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్కు ఆడాలని బీసీసీఐ నుంచి అతడికి ఆదేశాలు అందాయి. అతను పెడచెవిన పెట్టాడు. మరోవైపు ఇంగ్లాండ్తో సిరీస్లో రెండో మ్యాచ్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు కూడా బోర్డు నుంచి ఇలాంటి ఆదేశాలే రాగా.. పట్టించుకోలేదట. అందుకే ఇప్పుడు వీళ్లిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించారు.
శ్రేయస్ కథ వేరు..
ఇషాన్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ దగ్గర యాటిట్యూడ్ చూపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ శ్రేయస్ వ్యవహారం వేరు. అతను ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అది ఫామ్ మీద కూడా ప్రభావం చూపింది. దీంతో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. అతను ఫిట్నెస్ సమస్యలతో వైదొలిగాడా.. సెలక్టర్లు వేటు వేశారా అనే విషయంలో స్పష్టత లేదు. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో కొంత విశ్రాంతి అవసరమైంది. ఆ సమయంలోనే రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డు నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
అతను వెంటనే ఆ టోర్నీలో బరిలోకి దిగలేదు. కానీ సెమీస్ మ్యాచ్లో ముంబయికి ఆడాడు. పదో తేదీ నుంచి విదర్భతో జరగబోయే రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా ఆడతాడని సమాచారం. అయితే ఇప్పుడు అతణ్ని సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించారు. ఇషాన్ ఒక్కడిని లక్ష్యంగా చేసుకుంటే బాగోదని, సమస్య తీవ్రతను పెంచి చూపడానికి శ్రేయస్ను కూడా కలిపి బీసీసీఐ చర్యలు తీసుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన శ్రేయస్ లాంటి ఆటగాడితో బీసీసీఐ మరీ ఇంత కఠినంగా వ్యవహరించాల్సింది కాదని.. ఈ వ్యవహారంలో బలిపశువు అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తీసిపడేసే ఆటగాడు కాదు
శ్రేయస్ అయ్యర్ 59 వన్డేలు, 51 టీ20లు, 14 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో కొన్నేళ్లుగా రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఆ ఫార్మాట్లో 5 సెంచరీలు కూడా చేశాడు. గత ఏడాది ప్రపంచకప్లో వరుసగా రెండు అర్ధశతకాలు, రెండు శతకాలు సాధించాడు. ఇటీవల, ముఖ్యంగా టెస్టుల్లో ఫామ్తో కొంత తంటాలు పడుతున్న మాట వాస్తవం. కానీ అతణ్ని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్న సంగతీ మరువరాదు. ఈ నేపథ్యంలో శ్రేయస్కు ఒక హెచ్చరిక జారీ చేసి సరిపెట్టి ఉండాల్సిందని.. మూడు ఫార్మాట్లో భారత్కు ఆడుతున్న కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన శ్రేయస్ను చిన్న పొరబాటుకు సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించడం అన్యాయం అనే వాదన వినిపిస్తోంది.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్