Roshibina Devi: భయాలను వెనక్కినెట్టి.. పతకం పట్టి..
ఆటగాళ్లకు సాధన ఎంతో ముఖ్యం. కానీ, రాష్ట్రంలో నెలకొన్న హింస ఆమె సాధనను సజావుగా సాగనివ్వలేదు. పతకం గెలవాలన్న ఆమె పట్టుదలకు అవాంతరాలన్నీ తలొంచాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ కొనసాగించి ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది.
ఆసియా క్రీడల్లో మెరిసిన మణిపురి అమ్మాయి రోషిబినా
ఒకవైపు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అనే భయం.. తోటి క్రీడాకారిణులకు వీసా దక్కకపోవడంతో ఆందోళన.. ప్రాక్టీస్ లేదన్న టెన్షన్! ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మణిపుర్ (Manipur) అమ్మాయి రోషిబినా దేవి (Roshibina Devi) సత్తా చాటింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో (Asian Games 2023) ఉషూ (Wushu) ఈవెంట్లో రజతం గెలిచింది.
ఒకవైపు హింస..మరోవైపు సాధన
మణిపుర్లోని బిషన్పుర్ జిల్లాకు చెందిన రోషిబినా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చింది. మైతేయి తెగకు చెందిన ఈ అమ్మాయి.. చిన్నప్పటి నుంచి పోరాటాల మధ్యే పెరిగింది. రోషిబినా కుటుంబం ఉండే ప్రాంతంలోనే కుకీ తెగ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో గొడవలు సర్వసాధారణంగా ఉండేవి. కానీ, ఇటీవల ఆ గొడవలు కాస్త హింసగా మారిపోవడంతో అందరి కుటుంబాల్లాగే రోషిబినా కుటుంబం వణికిపోయింది. ఇలాంటి స్థితిలోనూ ప్రాక్టీస్ కొనసాగించి ఆసియా క్రీడల్లో పాల్గొని పతకం గెలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
బాక్సింగ్ నుంచి ఉషూకు
మణిపుర్లో ఎక్కువమంది ఎంచుకునే క్రీడ బాక్సింగే. అందుకే రోషిబినా కూడా చిన్నప్పుడు ఈ ఆటకే ఆకర్షితురాలైంది. ఎక్కువశాతం బాక్సింగ్ రింగ్లోనే ఉండేది. అయితే, ఒకసారి ఆమెకు ఉషు పరిచయం అయింది. అక్కడ నుంచి ఆమె ఈ క్రీడను వదల్లేదు. బాక్సింగ్ మాదిరే పంచ్లు.. కరాటేలోలా కిక్లతో మేళవించి ఉండే ఉషూ ఆమెకు బాగా నచ్చేసింది. రైతు కుటుంబమే అయినా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రోషిబినా ఆ ఆటలో ఎదిగింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ మణిపురి అమ్మాయి.. నెమ్మదిగా అంతర్జాతీయ టోర్నీలో మెరిసింది. 2016 ప్రపంచ జూనియర్ ఉషూ ఛాంపియన్షిప్లో కాంస్యంతో రాణించిన ఆమె.. 2018 జకార్త ఆసియా క్రీడల్లో కాంస్యంతో అదరగొట్టింది.
ఇబ్బందులు ఎదురైనా..
ఈసారి హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ పతకమే లక్ష్యంగా బరిలో దిగిన రోషిబినాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు మణిపుర్లో హింసాత్మక వాతావరణం ఆమెను బాగా కలవరపెట్టింది. రోషిబినా ఇంటికి దగ్గర్లోనే ఎన్నో అరాచకాలు జరిగాయి. ఆమె ఇల్లు పోలీస్ స్టేషన్కు సమీపంగానే ఉన్నా.. రక్షణ లేని పరిస్థితి ఉండడంతో రోషిబినా ప్రాక్టీస్ కూడా సజావుగా సాగలేదు. ప్రభుత్వం సాయం అందించడంతో ఎలాగో చైనా చేరుకున్న ఆమెకు అక్కడా మరో ఇబ్బంది ఎదురైంది. ఆమెతో ఎక్కువగా సాధన చేసే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన తోటి క్రీడాకారిణులకు వీసా ఇవ్వడానికి చైనా నిరాకరించింది. దీంతో ముగ్గురు ఉషు క్రీడాకారిణులు భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం రోషిబినా సాధనకు తీవ్ర ఆటంకం కలిగించింది. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా బరిలో దిగిన ఈ మణిపురి అమ్మాయి రజతంతో మెరిసింది. పతకం గెలిచిన తర్వాత తన వాళ్లను తలుచుకుని ఉద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ మణిపుర్ అల్లర్లలో బలైన వారికి తన పతకాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపింది. తాను తన గ్రామానికి కూడా తిరిగి వెళ్లే పరిస్థితులు ఇప్పుడు లేవని.. ఇది ఇంకా బాధ కలిగిస్తోందని రోషిబినా వాపోయింది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!