Roshibina Devi: భయాలను వెనక్కినెట్టి.. పతకం పట్టి..
ఆటగాళ్లకు సాధన ఎంతో ముఖ్యం. కానీ, రాష్ట్రంలో నెలకొన్న హింస ఆమె సాధనను సజావుగా సాగనివ్వలేదు. పతకం గెలవాలన్న ఆమె పట్టుదలకు అవాంతరాలన్నీ తలొంచాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ కొనసాగించి ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది.
ఆసియా క్రీడల్లో మెరిసిన మణిపురి అమ్మాయి రోషిబినా
ఒకవైపు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అనే భయం.. తోటి క్రీడాకారిణులకు వీసా దక్కకపోవడంతో ఆందోళన.. ప్రాక్టీస్ లేదన్న టెన్షన్! ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మణిపుర్ (Manipur) అమ్మాయి రోషిబినా దేవి (Roshibina Devi) సత్తా చాటింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో (Asian Games 2023) ఉషూ (Wushu) ఈవెంట్లో రజతం గెలిచింది.
ఒకవైపు హింస..మరోవైపు సాధన
మణిపుర్లోని బిషన్పుర్ జిల్లాకు చెందిన రోషిబినా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చింది. మైతేయి తెగకు చెందిన ఈ అమ్మాయి.. చిన్నప్పటి నుంచి పోరాటాల మధ్యే పెరిగింది. రోషిబినా కుటుంబం ఉండే ప్రాంతంలోనే కుకీ తెగ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో గొడవలు సర్వసాధారణంగా ఉండేవి. కానీ, ఇటీవల ఆ గొడవలు కాస్త హింసగా మారిపోవడంతో అందరి కుటుంబాల్లాగే రోషిబినా కుటుంబం వణికిపోయింది. ఇలాంటి స్థితిలోనూ ప్రాక్టీస్ కొనసాగించి ఆసియా క్రీడల్లో పాల్గొని పతకం గెలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
బాక్సింగ్ నుంచి ఉషూకు
మణిపుర్లో ఎక్కువమంది ఎంచుకునే క్రీడ బాక్సింగే. అందుకే రోషిబినా కూడా చిన్నప్పుడు ఈ ఆటకే ఆకర్షితురాలైంది. ఎక్కువశాతం బాక్సింగ్ రింగ్లోనే ఉండేది. అయితే, ఒకసారి ఆమెకు ఉషు పరిచయం అయింది. అక్కడ నుంచి ఆమె ఈ క్రీడను వదల్లేదు. బాక్సింగ్ మాదిరే పంచ్లు.. కరాటేలోలా కిక్లతో మేళవించి ఉండే ఉషూ ఆమెకు బాగా నచ్చేసింది. రైతు కుటుంబమే అయినా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రోషిబినా ఆ ఆటలో ఎదిగింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ మణిపురి అమ్మాయి.. నెమ్మదిగా అంతర్జాతీయ టోర్నీలో మెరిసింది. 2016 ప్రపంచ జూనియర్ ఉషూ ఛాంపియన్షిప్లో కాంస్యంతో రాణించిన ఆమె.. 2018 జకార్త ఆసియా క్రీడల్లో కాంస్యంతో అదరగొట్టింది.
ఇబ్బందులు ఎదురైనా..
ఈసారి హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ పతకమే లక్ష్యంగా బరిలో దిగిన రోషిబినాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు మణిపుర్లో హింసాత్మక వాతావరణం ఆమెను బాగా కలవరపెట్టింది. రోషిబినా ఇంటికి దగ్గర్లోనే ఎన్నో అరాచకాలు జరిగాయి. ఆమె ఇల్లు పోలీస్ స్టేషన్కు సమీపంగానే ఉన్నా.. రక్షణ లేని పరిస్థితి ఉండడంతో రోషిబినా ప్రాక్టీస్ కూడా సజావుగా సాగలేదు. ప్రభుత్వం సాయం అందించడంతో ఎలాగో చైనా చేరుకున్న ఆమెకు అక్కడా మరో ఇబ్బంది ఎదురైంది. ఆమెతో ఎక్కువగా సాధన చేసే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన తోటి క్రీడాకారిణులకు వీసా ఇవ్వడానికి చైనా నిరాకరించింది. దీంతో ముగ్గురు ఉషు క్రీడాకారిణులు భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం రోషిబినా సాధనకు తీవ్ర ఆటంకం కలిగించింది. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా బరిలో దిగిన ఈ మణిపురి అమ్మాయి రజతంతో మెరిసింది. పతకం గెలిచిన తర్వాత తన వాళ్లను తలుచుకుని ఉద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ మణిపుర్ అల్లర్లలో బలైన వారికి తన పతకాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపింది. తాను తన గ్రామానికి కూడా తిరిగి వెళ్లే పరిస్థితులు ఇప్పుడు లేవని.. ఇది ఇంకా బాధ కలిగిస్తోందని రోషిబినా వాపోయింది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్