Sports Awards 2023: సాత్విక్‌ జోడీకి ఖేల్‌రత్న.. మహ్మద్‌ షమికి అర్జున అవార్డు

2023 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. 

Updated : 20 Dec 2023 20:19 IST

దిల్లీ: 2023 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నను అందుకోనున్నారు. అర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ఐదుగురు ఎంపికయ్యారు. టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్‌ షమి (Mohammed Shami)కి అర్జున అవార్డు పురస్కారం దక్కింది. ఈ అవార్డులను 09 జనవరి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.     

అర్జున అవార్డు దక్కింది వీరికే 

ఓజస్ ప్రవీణ్ (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్‌), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), ఆర్ వైశాలి (చెస్), మహ్మద్ షమి (క్రికెట్), అనూష్ అగర్వాలా (ఈక్వస్ట్రియన్‌), దివ్యకృతి సింగ్  (ఈక్వస్ట్రియన్‌ డ్రస్సెజ్‌), దీక్షా దాగర్ (గోల్ఫ్‌), క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ), సుశీల చాను (హాకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రితూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో ఖో), పింకి (లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్),  ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్‌), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వు షూ), శీతల్ దేవి (పారా ఆర్చరీ), అజయ్‌రెడ్డి (అంధుల క్రికెట్‌), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్). 

ద్రోణాచార్య అవార్డులు 

రెగ్యులర్ కేటగిరీ: లలిత్ కుమార్‌ (రెజ్లింగ్), ఆర్‌.బి.రమేశ్ (చెస్), మహవీర్‌ ప్రసాద్ సైని (పారా అథ్లెటిక్స్‌), శివేంద్ర సింగ్ (హాకీ), గణేష్ ప్రభాకర్ (మల్లకంబ్).

లైఫ్‌టైమ్‌ కేటగిరీ: జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్‌), భాస్కరన్ ఈ (కబడ్డీ), జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్).

జీవిత సాఫల్య పురస్కారం 2023: మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్‌ శర్మ (హకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని