WI vs IND: భారత్తో ఐదో టీ20.. నికోలస్ పూరన్కు గాయాలు
వెస్టిండీస్, భారత్ మధ్య జరిగిన ఐదో టీ20లో నికోలస్ పూరన్ (Nicholas Pooran)కు గాయాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదు టీ20ల సిరీస్ను 3-2 తేడాతో చేజార్చుకుంది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. బ్రాండన్ కింగ్ (85*; 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (47; 35 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా నికోలస్ పూరన్ (Nicholas Pooran)కు స్వల్ప గాయాలయ్యాయి. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఓ బంతి పూరన్ పొట్ట భాగంలో బలంగా తాకింది. దీంతో బంతి తాకిన చోట చర్మం ఎర్రగా మారిపోయింది.
పూరన్ చేతికి కూడా గాయమైంది. కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతిని బ్రాండన్ కింగ్ బలంగా బాదాడు. వేగం వెళ్లిన బంతి మరో ఎండ్లో స్ట్రైకింగ్లో ఉన్న పూరన్ ఎడమ చేతి మణికట్టుకు పై భాగంలో తాకింది. దీంతో అతడి చేయిపై బంతి ఆకారంలో ఎర్రటి మచ్చ ఏర్పడింది. ఈ గాయాలకు సంబంధించిన ఫొటోను పూరన్ సామాజిక మాధ్యమం ట్విటర్ (X)లో పోస్టు చేశాడు. దానికి ‘‘మ్యాచ్ తర్వాత నా పరిస్థితి. థాంక్యూ బ్రాండన్ కింగ్, అర్ష్దీప్’’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.