IND vs AUS: ఆసీస్తో నాలుగో టెస్టు.. శ్రీకర్ భరత్కు మద్దతుగా నిలిచిన ద్రవిడ్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) ఆసీస్తో కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్లో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే తుది జట్టు ఎలా ఉంటుందనే సందిగ్ధత నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (KS Bharat) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో (IND vs AUS) ఆడుతున్నాడు. అయితే గత మూడు టెస్టుల్లో 8, 6, 23*, 17, 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నాలుగు టెస్టుకు అతడిపై వేటు తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అహ్మదాబాద్ టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అతడి శిక్షణను టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) దగ్గరుండి పర్యవేక్షించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టుకు తుది జట్టులో భరత్కు బదులు ఇషాన్ వస్తాడని అనుకుంటున్న వేళ.. రాహుల్ ద్రవిడ్ మాత్రం భరత్కు మద్దతుగా మాట్లాడాడు. ప్రెస్ కాన్ఫెరెన్స్లో విలేకర్లు భరత్ ప్రదర్శనపై ప్రశ్నకు ద్రవిడ్ సమాధానం ఇచ్చాడు.
‘‘భరత్ (KS Bharat) ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. అతడి దృక్పథంపై మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి. సవాళ్లు, పరిస్థితులను అర్థం చేసుకొని ఆడేందుకు ప్రయత్నిస్తాడు. మూడో టెస్టులో భరత్ గొప్పగా రాణించనప్పటికీ.. తొలి ఇన్నింగ్స్లో అతడు చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకం. దిల్లీలోనూ చాలా పాజిటివ్గా ఆడాడు. కఠినమైన పిచ్లపై కాస్త అదృష్టం కలిసిరావాల్సి ఉంటుంది. కానీ, భరత్కు అదే కలిసిరాలేదు. అయితే, అతడు ఆడే విధానం బాగుంది. అందుకే భరత్ బ్యాటింగ్పై ఆందోళన చెందకుండా మరింత దృష్టిపెడతాం’’ అని రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మద్దతుగా నిలిచాడు.
శ్రీకర్ భరత్ బ్యాటింగ్లో కాస్త నిరాశపరిచినప్పటికీ.. కీపింగ్ నైపుణ్యం మాత్రం ఆకట్టుకుంది. డీఆర్ఎస్లు తీసుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని దక్కించుకున్నాడు. ఇక నాలుగో టెస్టు భారత్కు కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తేనే టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTC Final) దూసుకెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. లేకపోతే శ్రీలంక - న్యూజిలాండ్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా దాదాపు లక్ష మందికిపైగా వస్తారనే అంచనా ఉంది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని వీక్షించేందుకు వస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తమ జట్లను ప్రకటించాయి. -
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి మద్దతు లభించింది. ఐపీఎల్ గతిని అది మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. -
దిల్లీ vs లఖ్నవూ.. ప్లేఆఫ్స్పై నేటి మ్యాచ్ ఫలితం ప్రభావమెంత?
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఒక్క జట్టు మాత్రమే ఇప్పటి వరకు క్వాలిఫై అయ్యింది. -
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
BCCI: టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. వేతనం, అర్హత వివరాలను వెల్లడించింది. -
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
ముంబయి ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో ఈ ఐపీఎస్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు హార్దిక్ నాయకత్వంపై ఆ జట్టు సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
టీ20 ప్రపంకప్ కోసం టీమ్ఇండియా రోహిత్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి