WI vs IND: జట్టులో మార్పులు సహజం.. సీనియర్ల పాత్ర చాలా కీలకం: రోహిత్
వెస్టిండీస్ - భారత్ జట్ల (WI vs IND) మధ్య గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టుకు ప్రత్యేకత ఉంది. ఇరు జట్లు తలపడే వందో టెస్టు కావడం విశేషం. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: గురువారం నుంచి వెస్టిండీస్ - భారత్ (WI vs IND) జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ విండీస్ ఆటగాళ్లు కనీసం పోరాటం చేయలేక చేతులెత్తేశారు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ భారీ శతకంతో అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఈ క్రమంలో రెండో టెస్టుకు కూడా ఇదే జట్టుతో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంది. రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్ - భారత్ మధ్య ఇది 100వ టెస్టు కావడం విశేషం. ట్రినిడాడ్ పిచ్, యువ క్రికెటర్లు, సీనియర్ల పాత్ర.. తదితర విషయాల గురించి రోహిత్ మాట్లాడాడు.
బర్త్డే బాయ్ ఇషాన్ను గిఫ్ట్ అడిగిన రోహిత్
డొమినికా పిచ్ను చూడగానే మాకు స్పష్టత వచ్చింది. పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలిసింది. కానీ, ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ ఎలా ఉండనుందో అర్థం కావడం లేదు. అయితే, డొమినికాతో పోల్చితే.. ఇక్కడి పిచ్ పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ ఉండవని భావిస్తున్నా. మ్యాచ్కు కాస్త ముందు మాత్రమే ఏం ఎంచుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టుపైనా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. ఇప్పటికైతే తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగేందుకు యోచిస్తున్నాం.
వారిదే భవిష్యత్తు
భారత క్రికెట్లో రాబోయే కాలంలో మరిన్ని మార్పులు జరుగుతాయి. ఎక్కడైనా సరే మార్పులు సహజమే. అయితే, సీనియర్ల పాత్ర చాలా కీలకంగా మారనుంది. కొత్తగా వచ్చే యువ క్రికెటర్లు తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక మేం సీనియర్లుగా వారిని సరైన మార్గంలో వెళ్లేలా చేయడమే మా కర్తవ్యం. ఆ తర్వాత జట్టు కోసం ఎలాంటి ప్రదర్శన ఇవ్వాలనేది వారి చేతుల్లోనే ఉంటుంది. భారత క్రికెట్కు వారే భవిష్యత్తు తరం ఆటగాళ్లు. మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది.
పుంజుకోవడం ఖాయం
మొదటి టెస్టులో ఘోర ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న విండీస్తో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. రెండో టెస్టులో తిరిగి పుంజుకొని పోటీనిస్తారని భావిస్తున్నాం. అలాగే ఇరు జట్ల మధ్య వందో టెస్టు జరగనుడటం గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశం ప్రతిరోజూ రాదు. రెండు దేశాల క్రికెట్కు ఘనమైన చరిత్ర ఉంది. అద్భుతమైన క్రికెట్ ఆడాం. ఇరు దేశాల మధ్య వందో టెస్టు మ్యాచ్ అయినప్పటికీ.. మా ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదు. విజయం కోసం పోరాడతాం’’ అని రోహిత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత