Ishan - Rohit: బర్త్డే బాయ్ ఇషాన్ను గిఫ్ట్ అడిగిన రోహిత్.. అదేంటో తెలుసా?
భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan kishan) 25వ పుట్టినరోజు నేడు. సహచర క్రికెటర్లు అతడితో కేక్ కోయించి సెలబ్రేషన్స్ చేశారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం అతడి నుంచే గిఫ్ట్ అడిగాడు. ఇంతకీ అందేంటంటే?
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పుట్టిన రోజంటే శుభాకాంక్షలు చెప్పి ఏదొక బహుమతిని ఇవ్వడం ఆనవాయితీ. కానీ, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం బర్త్డే బాయ్ ఇషాన్ కిషన్ను (Ishan Kishan) గిఫ్ట్ కావాలని కోరాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో (WI vs IND) ఉన్నాడు. ఇవాళ అతడి బర్త్డే. ఈ స్పెషల్డే సందర్భంగా ఇషాన్ ఏం చేశాడనేది వీడియో రూపంలో బీసీసీఐ (BCCI) తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రాక్టీస్ చేయడం నుంచి కేక్ కటింగ్ వరకు ఇషాన్ లైఫ్ను చూపించింది. విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో కూడా ఇషాన్ సంభాషించాడు. ఈ క్రమంలోనే ఇషాన్ను ఆటపట్టిస్తూ ఏం గిఫ్ట్ ఇస్తున్నావని రోహిత్ అడిగాడు. దానికి రోహితే సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
వెస్టిండీస్తో రెండో టెస్టు (WI vs IND) గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉండగా ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ ముగించుకుని డగౌట్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో రిపోర్టర్ ఒకరు ఇషాన్ బర్త్డేకు మీరేం గిఫ్ట్ ఇస్తారని రోహిత్ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
ఇషాన్నే ఈ ప్రశ్న అడుగుదామని చెప్పి.. నీకేం బహుమతి కావాలి? అని కిషన్ను రోహిత్ అడిగాడు. ఇషాన్ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే కలగజేసుకొని ‘అతడికి అన్నీ ఉన్నాయి’ అని అనడంతో అందరూ నవ్వేశారు. ‘ఇషాన్ నువ్వే మాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వు. విండీస్తో రెండో టెస్టులో సెంచరీ సాధించు. ఇదే భారత జట్టుకు ఇచ్చే బహుమతి’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. విండీస్తో తొలి టెస్టు సందర్భంగానే ఇషాన్ సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో పరుగుల (1*) ఖాతాను తెరిచే అవకాశం మాత్రమే వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాతో కెప్టెన్ రోహిత్ శర్మ సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది. లఖ్నవూ - ముంబయి మ్యాచ్ సందర్భంగా వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. -
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ట్రోల్ చేయడంపై భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదేవిధంగా లఖ్నవూతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్కు రూ.24 లక్షలు జరిమానా పడింది. -
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్