రిషబ్ పంత్ ఆటను బెన్ డకెట్ చూడలేదేమో : రోహిత్ శర్మ
బజ్బాల్ గురించి మాట్లాడే ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ రిషబ్ పంత్ ఆటను చూడాలని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బ్యాటింగ్పై ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ (Ben Duckett) చేసిన వ్యాఖ్యలను కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖండించాడు. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు మ్యాచ్కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్పంత్ గురించి ప్రస్తావించాడు. ‘‘మా జట్టులో రిషబ్ పంత్ (Rishabh Pant) ఉండేవాడు. తన దూకుడైన ఆటను, సిక్సర్లు కొట్టే తీరును బెన్ డకెట్ చూడలేదేమో’’ అంటూ చురకలంటించాడు.
మూడో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత తమ బజ్బాల్ గేమ్కు కొంత ప్రాధాన్యం దక్కుతుందని డకెట్ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇంగ్లాండ్ సహా పలు దేశాల మాజీ ఆటగాళ్ల నుంచి అతడు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జైస్వాల్ మీ నుంచి ఏమీ నేర్చుకోలేదు. వీలుంటే మీరే అతని దగ్గర నేర్చుకోండి అంటూ ఇంగ్లాండ్ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ తమ ఆటగాళ్లకు సూచించాడు. రికీ పాంటింగ్, క్రిస్గేల్ లాంటి వారు సైతం మాతరం క్రికెటర్ల ఆటను డకెట్ చూడలేదేమో అంటూ అతని వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
విలేకరులు బజ్బాల్ గురించి రోహిత్ శర్మను ప్రశ్నించగా బజ్బాల్ అంటే ఏమిటో తనకు తెలియదని, ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశారని రోహిత్ శర్మ అన్నాడు. ఈ సిరీస్లో జైస్వాల్ 4 మ్యాచుల్లో 94 సగటుతో 655 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అయితే, పాండ్య ఎంపికపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
IPL PlayOffs: గుజరాత్తో జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా మారతాయి? -
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
ఈసారి ఐపీఎల్ సీజన్లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా ధోనీ కోసమే వస్తున్నారా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధోనీ నామస్మరణతో మారు మోగిపోతోంది. -
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. -
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?