IPL 2024: వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ జట్టులో (T20 World Cup 2024) స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఐపీఎల్లో రాణిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు యువ క్రికెటర్లతోపాటు సీనియర్లూ సిద్ధంగా ఉన్నారు. కానీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ప్రదర్శన మాత్రం దారుణంగా ఉంది. రాజస్థాన్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. అశ్విన్ ఆటతీరు మాత్రం నిరాశపరుస్తోంది. దీంతో అతడిని పొట్టి కప్ పరిగణనలోకి తీసుకొనే అవకాశాలు చాలా తక్కువ. స్పెషలిస్ట్ స్పిన్నర్ రేసులో చాహల్, కుల్దీప్ ముందున్నారు. ఇక స్పిన్ ఆల్రౌండర్గా జడేజాదే స్థానం. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్ ఐపీఎల్లో కొనసాగే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో అశ్విన్ కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టాడు.
‘‘పరుగులు చేస్తున్నప్పుడు స్ట్రైక్రేట్తో సంబంధం లేదని కేఎల్ రాహుల్ గతంలో చెప్పాడు. అది బ్యాటింగ్ గురించి. ఇప్పుడు అశ్విన్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అయితే, వికెట్లు తీసినప్పుడే అలా కుదురుతుంది. ఒకవేళ అతడి గణాంకాలు సరిగ్గా లేకపోతే కనీసం వచ్చే ఏడాది జరగబోయే వేలంలో తీసుకొనేందుకు ఎవరూ ఆసక్తి కూడా చూపరు. అన్సోల్డ్గా మిగిలిపోవడం ఖాయం. ఏ జట్టైనా ఒక బౌలర్ నుంచి 25-30 పరుగులు కంటే ఎక్కువ ఇవ్వకుండా వికెట్లు తీయాలని కోరుకుంటుంది. అలా జరగకపోతే అతడిని తీసుకోవడం వృథాగానే భావిస్తుంది.
ఇప్పుడున్న స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. అశ్విన్ ఆఫ్ స్పిన్ వర్కౌట్ కావడం లేదు. ఎందుకు అతడు క్యారమ్ బౌలింగ్ చేయడం లేదు? గతంలో చాలాసార్లు దూస్రాలు సంధించి వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్పై నమ్మకం సన్నగిల్లినప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. నేనే మెంటార్ అయి ఉంటే నా జట్టులో ఎవరైనా వికెట్లు తీయడం కంటే పరుగులను నియంత్రించాలనుకుంటే మాత్రం వారికి మళ్లీ జట్టులో అవకాశం కల్పించను’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి