ఐసీసీ ర్యాంకింగ్స్.. స్మృతి మంధానకు కెరీర్‌లో బెస్ట్ రేటింగ్ పాయింట్స్

Eenadu icon
By Sports News Team Published : 28 Oct 2025 17:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో మంధాన మంచి ఆటతీరు కనబరుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (109) చేసిన మంధాన.. ప్రస్తుతం 365 రన్స్‌తో టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియాపై 80, ఇంగ్లాండ్‌పై 88 పరుగులు చేసింది. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో ఆమె కెరీర్‌లోనే బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించింది. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్మృతి (828)కు ఆరు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకు చేరుకున్న ఆష్లీన్ గార్డ్‌నర్ (731) మధ్య 97 పాయింట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. లారా వొల్వార్ట్ రెండు స్థానాలు మెరుగై మూడో ర్యాంక్‌లో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని