Surya in ICC Rankings: టాప్లోనే సూర్యకుమార్.. దూసుకొచ్చిన గిల్, తిలక్ వర్మ
వెస్టిండీస్ పర్యటనలో వచ్చిన అవకాశాలను భారత యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకున్నారు. వ్యక్తిగత ప్రదర్శన అదరగొట్టడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో (ICC Rankings) ఎగబాకారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు (Team India) అదరగొట్టారు. ఎప్పటిలానే సూర్యకుమార్ యాదవ్ (907 పాయింట్లు) టీ20ల్లో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఏకంగా 43 స్థానాలను మెరుగుపర్చుకుని 25వ ర్యాంక్లో నిలిచాడు. టాప్ -10లో సూర్యకుమార్ మినహా మరే భారత క్రికెటర్కు చోటు దక్కలేదు. రెండో ర్యాంక్లో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ (811)కు సూర్యకుమార్ పాయింట్ల వ్యత్యాసం భారీగానే ఉంది. విండీస్ పర్యటనలో అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన తిలక్ వర్మ (509) 46వ స్థానం, యశస్వి జైస్వాల్ (395) 88వ ర్యాంక్ సాధించారు.
వన్డేల్లోకి తిరిగొచ్చిన బెన్స్టోక్స్.. అసలెందుకు అతడిపై భారీ అంచనాలు?
బౌలింగ్ జాబితాలో మాత్రం తొలి పది మందిలో టీమ్ఇండియా ఆటగాడు లేడు. అయితే, ఆల్రౌండర్ లిస్ట్లో మాత్రం హార్దిక్ పాండ్య (250 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇక వన్డేఫార్మాట్లో శుభ్మన్ గిల్ (743 పాయింట్లు) ఐదో స్థానంలో, విరాట్ కోహ్లీ (705) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ (670) నాలుగు, కుల్దీప్ యాదవ్ (622) పదో స్థానంలో నిలిచారు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఓడిపోయినప్పటికీ భారత (264 రేటింగ్ పాయింట్లు) ర్యాంక్ మాత్రం మారలేదు. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇంగ్లాండ్ (259) నుంచి తీవ్ర పోటీ ఉంది. కివీస్తో జరగనున్న టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే స్థానాలు మారే అవకాశం ఉంది. వన్డేల్లో మాత్రం భారత్ (113) మూడో స్థానంలోనే నిలిచింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (118), పాకిస్థాన్ (116) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు