Cricket News: సూర్యకుమార్ గాయంపై అప్డేట్.. ఖవాజాకు ఐసీసీ అనుమతి నిరాకరణ!
ఇంటర్నెట్ డెస్క్: గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్పై (Surya kumar Yadav) అప్డేట్.. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా విజ్ఞాపనకు ఐసీసీ నిరాకరణ.. పీసీబీకి షాక్ ఇచ్చిన పాక్ ప్రభుత్వం.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
గాయాలు సరదా తీర్చేస్తాయ్ బాసూ..
టీ20ల్లో టాప్ బ్యాటర్, భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు గాయమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్ సందర్భంగా కాలు మడతబడటంతో ఇబ్బందిపడ్డాడు. అతడు వెంటనే జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా అతడి వీడియో ఒకటి బయటకొచ్చింది. కాలికి కట్టు వేసుకుని నడుస్తున్నాడు. ‘‘సీరియస్గా చెప్పాలంటే గాయాలను ఏమాత్రం సరదాగా తీసుకోకూడదు. కానీ, జీవితంలో ఇది కూడా ఒక దశ అని నేను భావిస్తా. పూర్తిగా కోలుకుని తిరిగి వస్తా. అప్పటివరకూ ప్రతి ఒక్కరూ ఈ పండగ సీజన్ను ఆస్వాదించండి’’ అని సూర్య పోస్టు చేశాడు.
అలాంవేవీ వాడటానికి వీల్లేదు: ఐసీసీ
పాకిస్థాన్తో బాక్సింగ్ డే టెస్టు (Boxing Day Test) శాంతి చిహ్నాలను తన బ్యాట్, బూట్లపై ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు నిరాశే ఎదురైంది. అలాంటివేమీ వాడవద్దని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్, తొలి టెస్టు సందర్భంగా ఖవాజా తన బూట్లపై నినాదాలు రాయడంపైనా ఇప్పటికే ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిపై వివరణ ఇవ్వాలని ఖవాజాను కోరింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలను ప్రదర్శించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగతమైన అభిప్రాయాలను మాత్రమే చెప్పానని.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ఖవాజా మీడియా ముఖంగానే వ్యాఖ్యలు చేశాడు.
పీసీబీకి ఎదురు దెబ్బ..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB)కి ఆ దేశ ప్రభుత్వం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. పాక్ సూపర్ లీగ్ (PSL)ను అమ్మడం, అంతర్జాతీయ మీడియా హక్కులు విక్రయం ద్వారా భారీగా ఆర్జన చేద్దామని భావించిన పీసీబీకి చుక్కెదురైంది. పీఎస్ఎల్ లీగ్ అమ్మకంతోపాటు మీడియా హక్కుల విక్రయాలపై నిషేధం విధిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘‘కేంద్ర క్రీడల శాఖ ఇప్పటికే నోటీసు జారీ చేసింది. క్రికెట్కు సంబంధించిన అతిపెద్ద డీల్స్ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి’’ అని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఈ విక్రయం ద్వారా పీసీబీ రూ. 270 కోట్ల వరకు ఆర్జించాలని భావించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.