బ్యాడ్లక్ ఓటమి ఏమాత్రం కాదు.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె పగులుతుందేమో..!
ప్రపంచ కప్లో బండ్లు ఓడలయ్యాయి.. ఓడలు బండ్లయ్యాయి. ఇంటికెళుతుందని భావించిన పాకిస్థాన్ పోరాడి ఫైనల్స్కు చేరింది.. ఫైనల్స్కు చేరుతుందని అంచనాలేసిన భారత్ చేతులెత్తేసి స్వదేశానికి పయనమైంది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వాస్తవానికి ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఏమీ ఓడిపోలేదు. ఎంపికలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మొండితనం.. ఓటముల నుంచి ఏమాత్రం నేర్చుకొని ఆటగాళ్ల తీరు కలిసి జట్టు అవమానకర రీతిలో ఓటమిని మూటగట్టుకొంది. టీమ్ఇండియా ఆడిన గ్రూప్-బిలో పాక్, దక్షిణాఫ్రికా మినహా మిగిలిన జట్లు మొత్తం పసికూనలే. అయినా కానీ, భారత్ సెమీస్కు చేరడానికి చెమటోడ్చింది. టోర్నీ మొత్తంలో విరాట్, సూర్య, అర్షదీప్ రాణించగా.. పాండ్యా కొంత మెరుగ్గా ఆడాడు.
ఆల్ రౌండర్లు.. కీపర్లతో జట్టుకు దక్కిందేమిటీ..?
ఆరు మ్యాచుల్లో కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే 200కు పైగా పరుగులు సాధించగా.. ముగ్గురు బ్యాటర్లు 150 లోపే పరుగులు చేశారు. పవర్ ప్లే అవకాశాలను ధ్వంసం చేసిన అపవాదును ఓపెనర్లు మూటగట్టుకొన్నారు. ఈ టోర్నీలో పవర్ప్లేలో భారత్ రన్రేట్ 6..! అతి తక్కువ రన్రేట్ ఉన్న నెదర్లాండ్స్ (5.4), జింబాబ్వే (5.7) తర్వాత స్థానం మనదే. ఇంగ్లాండ్తో మ్యాచ్ జరిగిన అడిలైడ్ బ్యాటింగ్ పిచ్. ఇక్కడ కూడా తొలి 10 ఓవర్లకు భారత్ సాధించిన స్కోర్ 62. అదే ఇంగ్లాండ్ తొలి 10 ఓవర్లలో 98 పరుగులు చేసి మ్యాచ్ను లాగేసుకొంది. ఇక భారత్ చివరి 10 ఓవర్లలో 106 పరుగులు చేసింది. ఈ గణాంకాలు చాలు టాప్ఆర్డర్ ఆటతీరును చెప్పడానికి.
☞ హార్దిక్ మినహా ఏ ఆల్రౌండర్ ఓ మోస్తారు ప్రదర్శన కూడా చేయలేదు. అశ్విన్, అక్షర్ కలిపి చేసిన పరుగులు 30 అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హుడాను కూడా ఒక మ్యాచ్లో ఆడించగా.. డకౌట్గా పెవిలియన్ చేరుకొన్నాడు. ఆ మ్యాచ్లో బౌలింగ్ కూడా చేయలేదు.
☞ సాధారణంగా బ్యాటింగ్ మెరుగ్గా చేసే వ్యక్తిని కీపర్గా తీసుకుంటారు. భారత్ ఈ టోర్నీలో ఇద్దరు కీపర్లతో ప్రయోగాలు చేసింది. వారిద్దరూ కలిపి చేసిన మొత్తం పరుగులు 23..!
☞ బౌలింగ్లో పేస్ దళానికి అండగా నిలిచే మిడిల్ ఓవర్ బౌలర్లు కరవయ్యారు. భువి, అర్ష్దీప్లు పొదుపుగానే బౌలింగ్ చేశారు. సూపర్ 12 దశలో భువి ఐదు మ్యాచుల్లో 16.4 ఓవర్లు బౌలింగ్ చేయగా.. 65 డాట్బాల్స్ విసిరాడు. అర్ష్దీప్ కూడా ఇంగ్లాండ్తో మ్యాచ్ మినహా టోర్నీ మొత్తంలో నిలకడగా వికెట్లు సాధించాడు. టీమ్ ఇండియాకు నాలుగు, ఐదు, ఆరో బౌలర్ల స్థానంలో ఆల్ రౌండర్లు అశ్విన్, అక్షర్, హార్దిక్ బౌలింగ్ చేశారు. అక్షర్ ఐదు మ్యాచ్లకు 3 వికెట్లు సాధించగా.. అశ్విన్ ఆరు మ్యాచ్లకు 6 వికెట్లు.. హార్దిక్ 8 వికెట్లు పడగొట్టారు. కానీ, ధారాళంగా పరుగులు ఇచ్చుకొన్నారు. అడిలైడ్ పిచ్ సీమర్లకు ఏమాత్రం సహకరించదు.. స్పిన్నర్లు జట్టుకు వికెట్లను అందించాల్సిన చోట చేతులెత్తేశారు.
☞ కోచ్గా ద్రవిడ్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో విఫలం అయ్యాడు. ఒత్తిడిని తట్టుకోవడం ప్రత్యేకంగా ఎవరికీ నేర్పించలేం అంటూ రోహిత్ చెప్పడం విడ్డూరంగా ఉంది. జట్టులో కోచ్ పాత్ర ఏమిటో ద్రవిడ్కు తెలియంది కాదు. దీనికి తోడు విఫలం అవుతున్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే.. కానీ, ప్రపంచకప్ వంటి టోర్నీలకు మ్యాచ్ విన్నర్లనే తీసుకెళ్లాలి. ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు.
వ్యక్తిగత ఆటతీరు ఇలా..
కెఎల్ రాహుల్: 6 మ్యాచ్లు ఆడి 128 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్, జింబాబ్వేతో మ్యాచ్ల్లో అర్ధశతకాలను మినహాయిస్తే.. అతడి స్కోర్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెంచడానికి కారణంగా మారాడు.
రోహిత్ శర్మ: 6 మ్యాచ్లు ఆడి 116 పరుగులు చేశాడు. బ్యాటర్గానే కాదు.. కెప్టెన్గానూ జట్టును నడిపించడంలో విఫలం అయ్యాడు. నెదర్లాండ్స్పై అర్ధశతకం మినహా టోర్నీలో గొప్పగా ఆడిందేమీ లేదు.
విరాట్ కోహ్లీ: ఈ టోర్నీలో భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. పరిస్థితిని బట్టి జట్టును ఆదుకొంటూ నాలుగు అర్ధశతకాలు చేశాడు. మొత్తం మీద 296 పరుగులు సాధించి టోర్నీలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ముఖ్యంగా పాక్పై అతడు ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
సూర్యకుమార్ యాదవ్: ఈ టోర్నీతో టీ20 క్రికెట్లో బెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. మూడు అర్ధశతకాలతో 239 పరుగులు చేశాడు. జింబాబ్వేపై ఇన్నింగ్స్ సంచలనం సృష్టించింది.
హార్దిక్ పాండ్యా: పాండ్యా ఆల్రౌండర్గా మెరుగ్గానే ఆడాడు. పాక్పై విలువైన 40 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో కూడా (3/30) రాణించాడు. కోహ్లీ హైవోల్టేజ్ ఇన్నింగ్స్తో పాండ్యా ప్రదర్శన వెలుగులోకి రాలేదు. ఇంగ్లాండ్పై కూడా అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమ్ ఇండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. 6 మ్యాచ్లు ఆడిన పాండ్యా 128 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీశాడు. జట్టులో అర్ష్దీప్ తర్వాత అత్యధిక వికెట్లు తీసింది ఇతడే.
దినేష్ కార్తిక్ : ధోనీ తర్వాత ఆ స్థానం భర్తీ చేసే కీపర్ టీమ్ ఇండియాకు దొరకలేదనే విషయం ఈ టోర్నీతో తేలిపోయింది. దినేష్ కార్తిక్ మ్యాచ్ ఫినిషర్ అనిపించుకొనే స్థాయి ప్రదర్శన ఒక్కటి కూడా లేదు. 4 మ్యాచ్ల్లో మూడు ఇన్నింగ్స్ ఆడి 14 పరుగులు మాత్రమే చేశాడు.
పంత్: ఆడింది రెండు మ్యాచ్లే.. కీలక సమయాల్లో బ్యాటింగ్కు వచ్చి పేలవంగా ఆడాడు.
రవిచంద్రన్ అశ్విన్: ఆల్రౌండర్గా అశ్విన్ ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యాడు. ఆరు మ్యాచ్లు ఆడిన అశ్విన్ 21 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. జింబాబ్వేపై సాధించిన మూడు వికెట్లను తీసేస్తే మిగిలిన మ్యాచ్ల్లో అతడి ప్రదర్శన ఏంటో తెలుస్తుంది.
అక్షర్ పటేల్: ఇతడిని టోర్నీలో ఎందుకు ఆడించారో కోచ్, కెప్టెన్కే తెలియాలి. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. బ్యాటర్గా అద్భుతంగా ఆడిన ఇన్నింగ్స్ కూడా ఏమీ లేవు. 5 మ్యాచ్లు ఆడి 9 పరుగులు చేసి 3 వికెట్లు సాధించాడు.
భువనేశ్వర్ కుమార్: ఇంగ్లాండ్పై మ్యాచ్ మినహా భువి మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. పవర్ప్లేలో ప్రత్యర్థులు చెలరేగిపోకుండా నియంత్రించాడు. కానీ, ప్రధాన బౌలరై ఉండి వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి.
షమి: ఈ టోర్నీలో షమి సీనియార్టీ ఎక్కడా ఉపయోగపడలేదు. 6 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు.
అర్ష్దీప్ సింగ్: జూనియర్ అయిన అర్ష్దీప్ జట్టులో స్టార్గా అవతరించాడు. తొలి ఓవర్లలోనే వికెట్లు సాధిస్తూ జట్టుకు మ్యాచ్ల్లో ఆధిపత్యం అందించాడు. ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన