బ్యాడ్లక్ ఓటమి ఏమాత్రం కాదు.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె పగులుతుందేమో..!
ప్రపంచ కప్లో బండ్లు ఓడలయ్యాయి.. ఓడలు బండ్లయ్యాయి. ఇంటికెళుతుందని భావించిన పాకిస్థాన్ పోరాడి ఫైనల్స్కు చేరింది.. ఫైనల్స్కు చేరుతుందని అంచనాలేసిన భారత్ చేతులెత్తేసి స్వదేశానికి పయనమైంది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వాస్తవానికి ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఏమీ ఓడిపోలేదు. ఎంపికలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మొండితనం.. ఓటముల నుంచి ఏమాత్రం నేర్చుకొని ఆటగాళ్ల తీరు కలిసి జట్టు అవమానకర రీతిలో ఓటమిని మూటగట్టుకొంది. టీమ్ఇండియా ఆడిన గ్రూప్-బిలో పాక్, దక్షిణాఫ్రికా మినహా మిగిలిన జట్లు మొత్తం పసికూనలే. అయినా కానీ, భారత్ సెమీస్కు చేరడానికి చెమటోడ్చింది. టోర్నీ మొత్తంలో విరాట్, సూర్య, అర్షదీప్ రాణించగా.. పాండ్యా కొంత మెరుగ్గా ఆడాడు.
ఆల్ రౌండర్లు.. కీపర్లతో జట్టుకు దక్కిందేమిటీ..?
ఆరు మ్యాచుల్లో కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే 200కు పైగా పరుగులు సాధించగా.. ముగ్గురు బ్యాటర్లు 150 లోపే పరుగులు చేశారు. పవర్ ప్లే అవకాశాలను ధ్వంసం చేసిన అపవాదును ఓపెనర్లు మూటగట్టుకొన్నారు. ఈ టోర్నీలో పవర్ప్లేలో భారత్ రన్రేట్ 6..! అతి తక్కువ రన్రేట్ ఉన్న నెదర్లాండ్స్ (5.4), జింబాబ్వే (5.7) తర్వాత స్థానం మనదే. ఇంగ్లాండ్తో మ్యాచ్ జరిగిన అడిలైడ్ బ్యాటింగ్ పిచ్. ఇక్కడ కూడా తొలి 10 ఓవర్లకు భారత్ సాధించిన స్కోర్ 62. అదే ఇంగ్లాండ్ తొలి 10 ఓవర్లలో 98 పరుగులు చేసి మ్యాచ్ను లాగేసుకొంది. ఇక భారత్ చివరి 10 ఓవర్లలో 106 పరుగులు చేసింది. ఈ గణాంకాలు చాలు టాప్ఆర్డర్ ఆటతీరును చెప్పడానికి.
☞ హార్దిక్ మినహా ఏ ఆల్రౌండర్ ఓ మోస్తారు ప్రదర్శన కూడా చేయలేదు. అశ్విన్, అక్షర్ కలిపి చేసిన పరుగులు 30 అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హుడాను కూడా ఒక మ్యాచ్లో ఆడించగా.. డకౌట్గా పెవిలియన్ చేరుకొన్నాడు. ఆ మ్యాచ్లో బౌలింగ్ కూడా చేయలేదు.
☞ సాధారణంగా బ్యాటింగ్ మెరుగ్గా చేసే వ్యక్తిని కీపర్గా తీసుకుంటారు. భారత్ ఈ టోర్నీలో ఇద్దరు కీపర్లతో ప్రయోగాలు చేసింది. వారిద్దరూ కలిపి చేసిన మొత్తం పరుగులు 23..!
☞ బౌలింగ్లో పేస్ దళానికి అండగా నిలిచే మిడిల్ ఓవర్ బౌలర్లు కరవయ్యారు. భువి, అర్ష్దీప్లు పొదుపుగానే బౌలింగ్ చేశారు. సూపర్ 12 దశలో భువి ఐదు మ్యాచుల్లో 16.4 ఓవర్లు బౌలింగ్ చేయగా.. 65 డాట్బాల్స్ విసిరాడు. అర్ష్దీప్ కూడా ఇంగ్లాండ్తో మ్యాచ్ మినహా టోర్నీ మొత్తంలో నిలకడగా వికెట్లు సాధించాడు. టీమ్ ఇండియాకు నాలుగు, ఐదు, ఆరో బౌలర్ల స్థానంలో ఆల్ రౌండర్లు అశ్విన్, అక్షర్, హార్దిక్ బౌలింగ్ చేశారు. అక్షర్ ఐదు మ్యాచ్లకు 3 వికెట్లు సాధించగా.. అశ్విన్ ఆరు మ్యాచ్లకు 6 వికెట్లు.. హార్దిక్ 8 వికెట్లు పడగొట్టారు. కానీ, ధారాళంగా పరుగులు ఇచ్చుకొన్నారు. అడిలైడ్ పిచ్ సీమర్లకు ఏమాత్రం సహకరించదు.. స్పిన్నర్లు జట్టుకు వికెట్లను అందించాల్సిన చోట చేతులెత్తేశారు.
☞ కోచ్గా ద్రవిడ్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో విఫలం అయ్యాడు. ఒత్తిడిని తట్టుకోవడం ప్రత్యేకంగా ఎవరికీ నేర్పించలేం అంటూ రోహిత్ చెప్పడం విడ్డూరంగా ఉంది. జట్టులో కోచ్ పాత్ర ఏమిటో ద్రవిడ్కు తెలియంది కాదు. దీనికి తోడు విఫలం అవుతున్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే.. కానీ, ప్రపంచకప్ వంటి టోర్నీలకు మ్యాచ్ విన్నర్లనే తీసుకెళ్లాలి. ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు.
వ్యక్తిగత ఆటతీరు ఇలా..
కెఎల్ రాహుల్: 6 మ్యాచ్లు ఆడి 128 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్, జింబాబ్వేతో మ్యాచ్ల్లో అర్ధశతకాలను మినహాయిస్తే.. అతడి స్కోర్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెంచడానికి కారణంగా మారాడు.
రోహిత్ శర్మ: 6 మ్యాచ్లు ఆడి 116 పరుగులు చేశాడు. బ్యాటర్గానే కాదు.. కెప్టెన్గానూ జట్టును నడిపించడంలో విఫలం అయ్యాడు. నెదర్లాండ్స్పై అర్ధశతకం మినహా టోర్నీలో గొప్పగా ఆడిందేమీ లేదు.
విరాట్ కోహ్లీ: ఈ టోర్నీలో భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. పరిస్థితిని బట్టి జట్టును ఆదుకొంటూ నాలుగు అర్ధశతకాలు చేశాడు. మొత్తం మీద 296 పరుగులు సాధించి టోర్నీలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ముఖ్యంగా పాక్పై అతడు ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
సూర్యకుమార్ యాదవ్: ఈ టోర్నీతో టీ20 క్రికెట్లో బెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. మూడు అర్ధశతకాలతో 239 పరుగులు చేశాడు. జింబాబ్వేపై ఇన్నింగ్స్ సంచలనం సృష్టించింది.
హార్దిక్ పాండ్యా: పాండ్యా ఆల్రౌండర్గా మెరుగ్గానే ఆడాడు. పాక్పై విలువైన 40 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో కూడా (3/30) రాణించాడు. కోహ్లీ హైవోల్టేజ్ ఇన్నింగ్స్తో పాండ్యా ప్రదర్శన వెలుగులోకి రాలేదు. ఇంగ్లాండ్పై కూడా అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమ్ ఇండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. 6 మ్యాచ్లు ఆడిన పాండ్యా 128 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీశాడు. జట్టులో అర్ష్దీప్ తర్వాత అత్యధిక వికెట్లు తీసింది ఇతడే.
దినేష్ కార్తిక్ : ధోనీ తర్వాత ఆ స్థానం భర్తీ చేసే కీపర్ టీమ్ ఇండియాకు దొరకలేదనే విషయం ఈ టోర్నీతో తేలిపోయింది. దినేష్ కార్తిక్ మ్యాచ్ ఫినిషర్ అనిపించుకొనే స్థాయి ప్రదర్శన ఒక్కటి కూడా లేదు. 4 మ్యాచ్ల్లో మూడు ఇన్నింగ్స్ ఆడి 14 పరుగులు మాత్రమే చేశాడు.
పంత్: ఆడింది రెండు మ్యాచ్లే.. కీలక సమయాల్లో బ్యాటింగ్కు వచ్చి పేలవంగా ఆడాడు.
రవిచంద్రన్ అశ్విన్: ఆల్రౌండర్గా అశ్విన్ ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యాడు. ఆరు మ్యాచ్లు ఆడిన అశ్విన్ 21 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. జింబాబ్వేపై సాధించిన మూడు వికెట్లను తీసేస్తే మిగిలిన మ్యాచ్ల్లో అతడి ప్రదర్శన ఏంటో తెలుస్తుంది.
అక్షర్ పటేల్: ఇతడిని టోర్నీలో ఎందుకు ఆడించారో కోచ్, కెప్టెన్కే తెలియాలి. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. బ్యాటర్గా అద్భుతంగా ఆడిన ఇన్నింగ్స్ కూడా ఏమీ లేవు. 5 మ్యాచ్లు ఆడి 9 పరుగులు చేసి 3 వికెట్లు సాధించాడు.
భువనేశ్వర్ కుమార్: ఇంగ్లాండ్పై మ్యాచ్ మినహా భువి మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. పవర్ప్లేలో ప్రత్యర్థులు చెలరేగిపోకుండా నియంత్రించాడు. కానీ, ప్రధాన బౌలరై ఉండి వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి.
షమి: ఈ టోర్నీలో షమి సీనియార్టీ ఎక్కడా ఉపయోగపడలేదు. 6 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు.
అర్ష్దీప్ సింగ్: జూనియర్ అయిన అర్ష్దీప్ జట్టులో స్టార్గా అవతరించాడు. తొలి ఓవర్లలోనే వికెట్లు సాధిస్తూ జట్టుకు మ్యాచ్ల్లో ఆధిపత్యం అందించాడు. ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.. -
సిరాజ్ మియా.. ఎక్కడ బౌలింగ్ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్ ఎటాక్!
భారత స్టార్ పేసర్గా మారిన సిరాజ్ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్ను తేలిగ్గా ఆడేస్తున్నారు. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. -
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్తో తలపడనుంది. -
Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్లో గుజరాత్పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. -
IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లాయి..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి