Vallem Tanvee: తొమ్మిదేళ్లకే ‘క్యూ’ పట్టి.. బిలియర్డ్స్లో హైదరాబాద్ బాలిక మెరుపులు
తన వయసు పిల్లలంతా ఆడుకుంటూ.. పాఠశాలకు వెళ్తుంటే.. ఆ అమ్మాయి మాత్రం తనకు అమ్మమ్మ వయసు ఉండే వాళ్లతో పోటీపడుతూ.. ప్రపంచ ఛాపింయన్షిప్లో ఆడేస్తోంది. తొమ్మిదేళ్లకే క్యూ పట్టి బాల్స్ని గురి చూసి కొడుతోంది.
ఆ బాలిక వయసు తొమిదేళ్లే! సాధారణంగా ఆ వయసు పిల్లలు ఏం చేస్తారు? తోటి పిల్లలతో ఆడుకుంటారు. పాఠశాలకు వెళ్తారు. కానీ, ఆ అమ్మాయి అంతర్జాతీయ టోర్నీల్లో ఆడుతోంది. అది కూడా ఎంతో ఏకాగ్రత అవసరమైన బిలియర్డ్స్ (Billiards)! ఆ అమ్మాయే హైదరాబాద్లో పుట్టి అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వల్లెం తన్వీ (Vallem Tanvee).
అమెరికాలోని మేరీల్యాండ్లో నివసించే తన్వీ.. అక్టోబర్ 19 నుంచి 22 వరకు ఆస్ట్రియాలో జరిగే ప్రతిష్ఠాత్మక ‘ప్రిడేటర్ డబ్ల్యూపీఏ ప్రపంచ 10 బాల్ సీనియర్ ఛాంపియన్షిప్’లో పోటీపడబోతోంది. ఈ టోర్నీలో ఆడబోతున్న పిన్న వయస్కురాలు తన్వీనే. 9 బాల్ ఫార్మాట్ నుంచి 10 బాల్ ఫార్మాట్కు మారిన బిలియర్డ్స్లో తన్వీ ఆడటమే ఎక్కువ అంటే.. ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీపడడం మామూలు విషయం కాదు. ఫ్యూర్టోరికోలో జరిగిన 9 బాల్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొని ఆ టోర్నీలో ఆడిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన తన్వీ.. ఇప్పుడు మరో రికార్డు కోసం ఎదురుచూస్తోంది. 2022 అక్టోబర్లో తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడిన తన్వీ.. అండర్-17 విభాగంలోనూ సత్తా చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది.
నాన్న సరదాగా తెస్తే..
గతేడాది ఆరంభంలో ఇంట్లో ఏదో సరదాగా ఆడటం కోసం తెచ్చిన పూల్ టేబుల్ని చూసి తన్వీ ఆకర్షితురాలైంది. ఎనిమిదేళ్లకే క్యూని కచ్చితంగా పట్టుకోవడం.. బాల్స్ని గురి చూసి కొట్టడం అలవాటు చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటపై మరింత పట్టు సాధించిన ఆమె.. పోటీలకు వెళ్లే స్థాయికి చేరింది. అమెరికాలోని స్థానిక కోచ్ రాయ్ పాస్టర్ దగ్గర తీసుకున్న శిక్షణ తన్వీని మెరుగైన క్రీడాకారిణిగా మలిచింది. ఈ ఏడాది జనవరిలో అమెరికాలో జరిగిన కమూయ్ ప్రపంచ మహిళల 9-బాల్ ఛాంపియన్షిప్లో పోటీపడి ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే చిత్ర మగిమైరాజ్ లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఆడిన టోర్నీలో ఈ చిన్నది ఎలాంటి బెరుకు లేకుండా పాల్గొంది. అందుకే ఆమెకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ప్రిడియేటర్ గ్రూప్ ముందుకొచ్చింది. త్వరలో ఆమె పోటీపడబోయే ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో తన్వీ కన్నా 40 ఏళ్లు పెద్దదైన 49 ఏళ్ల చిత్ర మగిమైరాజ్ కూడా బరిలోఉండటం విశేషం.
ఏకాగ్రత చెదరదు
తొమ్మిదేళ్ల బాలిక అంటే అల్లరి చేయడం సహజం. చెప్పినట్లు వినకుండా వాళ్లకి నచ్చిన పని చేస్తుంటారు. అలాంటిది ఏకాగ్రతకు మారుపేరుగా ఉండే క్యూ ఆటలో తన్వీ ఎలాంటి తడబాటు లేకుండా ముందుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనకు అమ్మమ్మ వయసు ఉండే వాళ్లతో పోటీపడటం ఇంకా చిత్రంగా అనిపిస్తోంది. ‘‘తన్వీకి చిన్నప్పటి నుంచే బిలియర్డ్స్పై బాగా ఇష్టం కలిగింది. ఇంత చిన్న వయసులో సీనియర్లతో పోటీపడడం అంత తేలికేం కాదు. ఓడిపోతే ఏడ్వటం చిన్న పిల్లలకు సహజం. కానీ తన్వీ మాత్రం ధైర్యంగా ఉంటుంది. ఓటమిని కూడా పాజిటివ్గా తీసుకుంటుంది. ఈ వయసులో ఆ అమ్మాయి పరిణతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. త్వరలో ఆమె సీనియర్ విభాగంలోనూ సత్తా చాటుతుంది’’ అని కోచ్లు చెబుతున్నారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు