Virat: ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. వాటిని దాటుకొని ముందుకు సాగడమే: విరాట్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. అలాగే చాలా విమర్శలూ ఎదుర్కొన్నాడు. కానీ, వాటన్నింటినీ తన బ్యాటింగ్తో సమాధానం చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులకు ఆదర్శంగా ఉంటాడు. ఆటపట్ల నిబద్ధత తారస్థాయిలో ఉంటుంది. ఏ స్థాయి మ్యాచ్ అయినా సరే తన జట్టు గెలుపు బాటలోనే పయనించాలనే కోరుకుంటాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరాడి ముందుకు సాగడమే తన క్రికెట్ కెరీర్లో నేర్చుకున్న ప్రధాన అంశమని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు.
Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?
‘‘వ్యక్తిగతంగా, ఆటపరంగా నా సామర్థ్యాలను నమ్మి ముందుకు సాగడమే నన్నింత వరకు తీసుకురాగలిగింది. బయట ఉంటే ప్రజలకు వారి అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. వాటి నుంచి కూడా అవసరమైనవాటిని నేర్చుకుని ముందుకు సాగుతుంటా. నా సామర్థ్యం మీద నమ్మకం ఉంచడం వల్ల ఎన్ని అవాంతరాలు ఎదురైనా దాటుకుని లక్ష్యాలను సాధించగలిగా. ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉండటం వల్లే నా గేమ్ మీద దృష్టి పెట్టి నిరంతరం మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటా. గతంలో ఏం సాధించాను.. వాటి నుంచి ఏం నేర్చుకుని ముందుకు సాగాలనేదానిపైనే ఆలోచిస్తుంటా. ఆటగాడిగా ఎలాంటి ప్రదేశాల్లో బలహీనంగా ఉన్నానేదానిపై దృష్టిపెట్టి మెరుగయ్యా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఘనంగా పునరాగమనం చేయగలిగా’’ అని కోహ్లీ తెలిపాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ వన్డేతోపాటు టీ20 సిరీస్ల నుంచి విరామం తీసుకున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.