ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని ఆర్డీఎస్ ఆనకట్ట, కాల్వలను శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం పరిశీలించింది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై,
శాంతినగర్, న్యూస్టుడే: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని ఆర్డీఎస్ ఆనకట్ట, కాల్వలను శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం పరిశీలించింది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై, సబ్ కమిటీ సభ్యుడు శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు ఆర్డీఎస్లో నీటి వాటా, దీని ద్వారా వాడుకుంటున్న నీరు, మరమ్మతులు, ఆనకట్ట పరిస్థితి గురించి ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక పరిధిలోని కాల్వ వెంట తిరిగారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూర్ ప్రధాన కాల్వ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, సుంకేసుల బ్యారేజీలను పరిశీలించి తుంగభద్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వాడుతున్న నీటి వివరాలకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు. వారి వెంట కేఆర్ఎంబీ ఎస్ఈ అశోక్, ఆర్డీఎస్ డీఈఈలు, ఏఈలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!