రైతు ఐక్యతకు వేదిక
అధునాతన డిజిటల్ సౌకర్యాలతో రైతులకు ఉపయోగపడేలా వీటిని నిర్మించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రూపుదిద్దుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన ఈ వేదికల ద్వారా రాష్ట్రంలోని రైతులందరితో ఒకేసారి ఆన్లైన్ ద్వారా సమావేశమై ...
పంటల సాగుపై గ్రామస్థాయిలో చర్చలకు అవకాశం
ఆధునిక పరిజ్ఞానం, ఆన్లైన్ సమావేశాలకు మందిరం
రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం.. నేడు ప్రారంభించనున్న సీఎం
ఈనాడు - హైదరాబాద్
గ్రామస్థాయిలో అన్నదాతలంతా ఓ చోట చేరి కష్టనష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏర్పాటైన ఆధునిక మందిరాలే రైతు వేదికలు. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంలో భాగంగా వారిని చైతన్య పరిచేందుకు ప్రతి ఐదువేల ఎకరాలకొకటి చొప్పున కూడలి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వీటిని నిర్మించింది. ప్రభుత్వ నిధులే కాకుండా ప్రజాప్రతినిధులూ ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలను అందజేశారు.
అధునాతన డిజిటల్ సౌకర్యాలతో రైతులకు ఉపయోగపడేలా వీటిని నిర్మించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రూపుదిద్దుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన ఈ వేదికల ద్వారా రాష్ట్రంలోని రైతులందరితో ఒకేసారి ఆన్లైన్ ద్వారా సమావేశమై ప్రభుత్వ పథకాలు, ఆధునిక పరిజ్ఞానాన్ని వివరించాలన్నది వ్యవసాయశాఖ లక్ష్యం. జనగామ జిల్లా కొడకండ్లలో శనివారం సీఎం కేసీఆర్ రైతువేదిక భవనాన్ని ప్రారంభించనున్నారు. 5000 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సమగ్ర వివరాలతో కథనం..
* ప్రతి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు వీటిని నిర్మించారు.
* ఒక్కో రైతువేదికలో 2,046 చదరపు అడుగుల స్థలం ఉంది. సమావేశ మందిరంతోపాటు రెండుగదులు, రెండుమరుగుదొడ్లు నిర్మించారు.
* మిషన్ భగీరథ పథకం నుంచి మంచి నీరు, విద్యుత్ సంస్థలు కరెంటు కనెక్షన్లు ఇస్తున్నాయి.
* ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలు కేటాయించారు. ఇందులో వ్యవసాయ శాఖ రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు సమకూర్చారు.
వేదికల్లో ఏం చేయాలంటే..
* పంటల సాగుకు అవసరమైన అధునాతన పరిజ్ఞానాన్ని అందించి పంటల ఉత్పాదకత పెంచడానికి, గిట్టుబాటు ధరలు పొందేలా చూసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వేదికలు ఉపయోగపడాలి.
* ప్రభుత్వానికి, గ్రామస్థాయిలో ఉండే రైతులకు మధ్య వారధిలా ఇవి పనిచేయాలి.
* వ్యవసాయశాఖలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకరి చొప్పున పనిచేస్తున్న ‘వ్యవసాయ విస్తరణ అధికారులు’(ఏఈఓ) ఈ భవనంలో కార్యాలయం ఏర్పాటుచేసుకుని రైతులకు అందుబాటులో ఉండాలి.
* రైతులకు పంటరుణాలు, పథకాల రాయితీలు సక్రమంగా అందేందుకు వేదికలు సేవలందించాలి.
ఇదొక అద్భుత ఆలోచన
- జనార్దన్రెడ్డి ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ
రైతువేదికల నిర్మాణం ఓ అద్భుతమైన ఆలోచన. వ్యవసాయ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఏఈఓలుగా గ్రామస్థాయిలో వేదికల ద్వారా పనిచేయడం ఈ రంగ అభివృద్ధికి మంచి అవకాశం. ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. అవసరమైన పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి ఈ వేదికలు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.
రైతు వేదికల ముఖచిత్రం
* మొత్తం నిర్మించాల్సిన వేదికలు : 2,601 (గ్రామాల్లో 2462, పట్టణాల్లో 139)
* ఇప్పటివరకు పూర్తయినవి : 1,951
* నిర్మాణంలో ఉన్నవి : 650
* వీటి కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు : రూ.572.22 కోట్లు
* పూర్తిగా విరాళాల సొమ్ముతో నిర్మించేవి : 23
* ఎన్ని చోట్ల భూమి ఉచితంగా లభించింది : 139
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?