జీవో 317లోని లోపాలతో శాశ్వతంగా అన్యాయం
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ఆధారంగా స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317లో అనేక లోపాలు ఉన్నాయని 17 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన పోరాట కమిటీ (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్కు
సీఎంకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేఖ
ఒక్కసారి తమతో చర్చించాలంటూ విజ్ఞప్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ఆధారంగా స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317లో అనేక లోపాలు ఉన్నాయని 17 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన పోరాట కమిటీ (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆదివారం లేఖ రాసింది. లోపాలను సవరించకపోతే కొందరికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని పేర్కొంది. సంఘాలతో ఒక్కసారి చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని అభ్యర్థించింది. లేఖలో పేర్కొన్నఅంశాలు... ‘‘రాష్ట్రంలో 33 జిల్లాలను ఏడు జోన్లు, రెండు బహుళ జోన్లుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను శాఖల వారీగా జిల్లా, జోనల్, బహుళజోనల్ పోస్టులుగా (లోకల్ కేడర్) వర్గీకరించారు. నూతన లోకల్ కేడర్లలో సర్దుబాటు చేయడానికి 06.12.2021న జారీ చేసిన జీవో 317లో పేర్కొన్న మార్గదర్శకాలు వివాదాస్పదంగా మారాయి. ఉద్యోగుల అభ్యంతరాలు, అభ్యర్థనలను పట్టించుకోకుండా కేటాయింపులు చేయడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారు. సీనియారిటీ జాబితాలు, స్పెషల్ కేటగిరి అభ్యర్థనలను సక్రమంగా పరిశీలించలేదు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లాల కేటాయింపులోనూ కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయి. భార్యాభర్తలను ఒకే లోకల్ కేడర్కు బదిలీ చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. నష్టపోయిన అభ్యర్థులు న్యాయం చేయాలంటూ అప్పీల్ చేసుకుని నెల రోజులు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదనతో ప్రభుత్వానికి సమస్యను తెలిపేందుకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ ఈ సమస్యను మీ దృష్టికి తీసుకురావడంలో ఉన్నతాధికారులు, కొన్ని సంఘాల నాయకులు విఫలమయ్యారని భావిస్తున్నాం. ఇప్పటికైనా పోరాట కమిటీకి (స్టీరింగ్ కమిటీకి) అపాయింట్మెంట్ ఇస్తే కీలక సమస్యలను మీ దృష్టికి తీసుకురాగలం. తగిన పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అంటూ సంఘాలు లేఖలో విజ్ఞప్తి చేశాయి.
ఉద్యోగులు వారం రోజుల్లో విధుల్లో చేరాలి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జరిపిన కేటాయింపుల మేరకు బదిలీ అయిన ఉద్యోగులు విధుల్లో చేరకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ ముందుగా వారికి సంజాయిషీ నోటీసు ఇచ్చి ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలిసింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అంతర్గత ఉత్తర్వులు జారీ చేయనుంది. బదలాయింపుల అనంతరం దాదాపు రెండు వందల మంది వరకు ఉద్యోగులు విధుల్లో చేరలేదు. కొత్త స్థానాలపై సంబంధిత ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయకుండా... ఇళ్ల వద్దే ఉంటున్నారు. మరికొంత మంది కార్యాలయాలకు రావడం లేదు. ఉద్యోగులు విధుల్లో చేరకపోవడంతో వారికి నిర్దేశించిన స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత ఉద్యోగులకు విధుల్లో చేరేందుకు మరో వారం రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత వాటిని ఖాళీలుగా చూపి, ఉద్యోగాల భర్తీకి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి