జీవో 317లోని లోపాలతో శాశ్వతంగా అన్యాయం
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ఆధారంగా స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317లో అనేక లోపాలు ఉన్నాయని 17 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన పోరాట కమిటీ (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్కు
సీఎంకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేఖ
ఒక్కసారి తమతో చర్చించాలంటూ విజ్ఞప్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ఆధారంగా స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317లో అనేక లోపాలు ఉన్నాయని 17 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన పోరాట కమిటీ (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆదివారం లేఖ రాసింది. లోపాలను సవరించకపోతే కొందరికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని పేర్కొంది. సంఘాలతో ఒక్కసారి చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని అభ్యర్థించింది. లేఖలో పేర్కొన్నఅంశాలు... ‘‘రాష్ట్రంలో 33 జిల్లాలను ఏడు జోన్లు, రెండు బహుళ జోన్లుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను శాఖల వారీగా జిల్లా, జోనల్, బహుళజోనల్ పోస్టులుగా (లోకల్ కేడర్) వర్గీకరించారు. నూతన లోకల్ కేడర్లలో సర్దుబాటు చేయడానికి 06.12.2021న జారీ చేసిన జీవో 317లో పేర్కొన్న మార్గదర్శకాలు వివాదాస్పదంగా మారాయి. ఉద్యోగుల అభ్యంతరాలు, అభ్యర్థనలను పట్టించుకోకుండా కేటాయింపులు చేయడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారు. సీనియారిటీ జాబితాలు, స్పెషల్ కేటగిరి అభ్యర్థనలను సక్రమంగా పరిశీలించలేదు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లాల కేటాయింపులోనూ కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయి. భార్యాభర్తలను ఒకే లోకల్ కేడర్కు బదిలీ చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. నష్టపోయిన అభ్యర్థులు న్యాయం చేయాలంటూ అప్పీల్ చేసుకుని నెల రోజులు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదనతో ప్రభుత్వానికి సమస్యను తెలిపేందుకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ ఈ సమస్యను మీ దృష్టికి తీసుకురావడంలో ఉన్నతాధికారులు, కొన్ని సంఘాల నాయకులు విఫలమయ్యారని భావిస్తున్నాం. ఇప్పటికైనా పోరాట కమిటీకి (స్టీరింగ్ కమిటీకి) అపాయింట్మెంట్ ఇస్తే కీలక సమస్యలను మీ దృష్టికి తీసుకురాగలం. తగిన పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అంటూ సంఘాలు లేఖలో విజ్ఞప్తి చేశాయి.
ఉద్యోగులు వారం రోజుల్లో విధుల్లో చేరాలి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జరిపిన కేటాయింపుల మేరకు బదిలీ అయిన ఉద్యోగులు విధుల్లో చేరకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ ముందుగా వారికి సంజాయిషీ నోటీసు ఇచ్చి ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలిసింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అంతర్గత ఉత్తర్వులు జారీ చేయనుంది. బదలాయింపుల అనంతరం దాదాపు రెండు వందల మంది వరకు ఉద్యోగులు విధుల్లో చేరలేదు. కొత్త స్థానాలపై సంబంధిత ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయకుండా... ఇళ్ల వద్దే ఉంటున్నారు. మరికొంత మంది కార్యాలయాలకు రావడం లేదు. ఉద్యోగులు విధుల్లో చేరకపోవడంతో వారికి నిర్దేశించిన స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత ఉద్యోగులకు విధుల్లో చేరేందుకు మరో వారం రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత వాటిని ఖాళీలుగా చూపి, ఉద్యోగాల భర్తీకి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి