ఎన్డీయే కూటమిలో జగన్ చేరాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు మంచి మిత్రుడని, ఆయన ఎన్డీయే కూటమిలో చేరాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నానని కేంద్ర సామాజిక న్యాయం,
‘ఉక్కు’ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు
కేంద్ర మంత్రి రామదాస్ అఠావలే
విశాఖపట్నం (వన్టౌన్), న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు మంచి మిత్రుడని, ఆయన ఎన్డీయే కూటమిలో చేరాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నానని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ సహాయ మంత్రి రాందాస్ అఠావలే అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గవర్నర్ బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు. ‘మేం ఎన్డీయేను విస్తరించాలనుకుంటున్నాం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎన్డీయేలో చేరాలని నేను కోరుతున్నాను. అదే జరిగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత సాయం అందుతుంది. దానిగురించి ఆలోచించండి. జగన్ సిద్ధంగా ఉంటే.. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో నేను మాట్లాడతాను. వైకాపా ఎప్పుడూ రాజ్యసభ, లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంది. ఆయన ఎన్డీయేలో చేరితే జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు. మూడు రాజధానుల వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపారు.
* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఠావలే వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిందని, అది అమలైతే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు