అద్దె ఇళ్లలోనే అంగన్వాడీలు
ఇది మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రం. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి టీచర్, వర్కర్ విధులు మానేయడంతో మరో గ్రామ టీచర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేంద్రం పరిధిలో 20 మంది లబ్ధిదారులు ఉన్నారు.
12వేలకు పైగా కేంద్రాలకు సొంత భవనాలు కరవు
ఉన్నవీ శిథిలావస్థలోనే
పట్టాలెక్కని అంగన్వాడీల ఆధునికీకరణ
ఇది మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రం. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి టీచర్, వర్కర్ విధులు మానేయడంతో మరో గ్రామ టీచర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేంద్రం పరిధిలో 20 మంది లబ్ధిదారులు ఉన్నారు. గోడలు బీటలువారి, కూర్చునేందుకూ చోటులేక బాలలు ఇబ్బంది పడుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్వహణ సరిగాలేక కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరాయి.. ఇప్పటికీ భవన నిర్మాణాలు పూర్తికాని కేంద్రాలన్నీ కనీస వసతుల్లేని అద్దెగూళ్లలో సాగుతున్నాయి. వీటిలో చదువుకునేందుకు వచ్చే చిన్నారులు, పోషకాహారం కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వర్షం వస్తే నేలపై కూర్చోలేని దుస్థితి. రాష్ట్రంలో దాదాపు 34శాతం అంగన్వాడీలు నేటికీ అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. వాటికి ఉపాధిహామీ పథకం కింద శాశ్వత భవనాలు నిర్మించేందుకు నిర్ణయించినా ఆచరణ సాధ్యం కాలేదు. కేరళ తరహాలో అంగన్వాడీలను అభివృద్ధి చేస్తామన్న హామీలు అమలుకు నోచలేదు. అద్దెభవనాల భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే 5వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల ప్రాంగణాల్లోకి మార్చారు. జనావాసాలకు దూరంగా ఉన్న వాటి చెంతకు వెళ్లలేక గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారు.
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో బాలింతలు, గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలు దాదాపు 23లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాల్లో ఉన్నా ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. వాటిని ఖాళీచేసి కొన్నిచోట్ల అద్దెభవనాల్లో కేంద్రాల్ని నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000, పట్టణాల్లో రూ.4వేలు, నగరాల్లో రూ.6వేల చొప్పున అద్దె చెల్లిస్తోంది. ఇలా ఇస్తున్న అద్దెలు ఏ మూలకూ సరిపోక, అరకొర సౌకర్యాల నీడన నెట్టుకురావాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అంగన్వాడీ సిబ్బంది సొంతగా ఖర్చులను భరించాల్సి వస్తోంది.
పూర్తికాని నిర్మాణాలు..
ఉపాధిహామీ కింద రాష్ట్రంలో 2,734 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి కేంద్రం అనుమతించగా నేటికి 848 పూర్తయ్యాయి. గ్రామాల్లో అనువైన స్థలాలు లేకపోవడంతో పాటు, ఉపాధిహామీ కింద ఇతర పనులు చేపట్టడంతో మిగతా 1,886 అంగన్వాడీల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో కొత్త కేంద్రాలు మంజూరు చేయాలని మహిళా శిశుసంక్షేమశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంగన్వాడీలను సమీప ప్రభుత్వ, పరిషత్ పాఠశాలలకు మార్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అద్దెభవనాల్లోని కేంద్రాలకు బదిలీల్లో తొలిప్రాధాన్యం ఇవ్వాలని, బడిలోనే ఒక గదిని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించాలని తెలిపింది. ఒకేగదిలో వంట, పిల్లలకు ఆటపాటలు సాధ్యం కాదని, బాలింతలు, గర్భిణులు దూరంగా ఉన్న పాఠశాలలకు రాలేరని శిశు సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. పాఠశాల ఆవరణలోకి మార్చితే పౌష్టికాహార లక్ష్యం నెరవేరదని అంగన్వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్లోని అంగన్వాడీ రెండో కేంద్రమిది. ఇక్కడ 25మంది పిల్లలు శిశువిద్య నేర్చుకుంటున్నారు. పౌష్టికాహారం తీసుకుంటున్నారు. వర్షం వస్తే శ్లాబు నుంచి కారే నీరు వంటగదిలోకి చేరుతోంది. వండిపెట్టడం ఇబ్బంది అవుతోంది. వానొస్తే హాజరు సగానికిపైగా పడిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇదీ సంగతి!
-
దేశ శత్రువుల ఓటమి ఖాయం
‘‘140 కోట్ల మంది భారతీయుల సంకల్పం జూన్ నాలుగో తేదీన నెరవేరబోతోంది. భాజపాను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశ శత్రువులు ఓడిపోవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!