Khammam: నా మృతదేహాన్ని ఇండియాకు తీసుకెళ్లండి
ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలుసుకున్న ఆ యువకుడు కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసినా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు.
మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్న యువకుడు
ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆస్ట్రేలియాలో మృతి
ఖమ్మంలో అంతిమ సంస్కారాలు పూర్తి
ఖమ్మం సంక్షేమ విభాగం, న్యూస్టుడే: ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలుసుకున్న ఆ యువకుడు కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసినా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు. అమ్మా..నాన్నా...నేను చనిపోతున్నా. మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఓదార్చాడు. తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. నమ్మలేకున్నా..కళ్లు చెమ్మగిల్లే వాస్తవమిది. చివరకు అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. ఖమ్మంలో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి స్థిరాస్తి వ్యాపారి, తల్లి ప్రమీల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్ (33), రెండో కుమారుడు అఖిల్. హర్షవర్ధన్ బీ-ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. క్వీన్స్ల్యాండ్ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డాక్టర్గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తరువాత భార్యను తీసుకెళ్తానని చెప్పి... అదేనెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. అదే ఏడాది అక్టోబరు నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతోపాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేయమని తల్లిదండ్రులు కోరగా.. ‘ఇక్కడే మంచి చికిత్స లభిస్తుంది. మీరేం కంగారు పడకండి’ అని వారికి నచ్చజెప్పాడు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు...
క్యాన్సర్ సోకింది.. నయమయ్యే పరిస్థితి లేదు.. ఇక చావు తప్పదని తెలిసిన ఆ యువకుడు ముందుగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. తొలుత క్యాన్సర్కు చికిత్స తీసుకోగా.. నయమైందని వైద్యులు తెలిపారు. 2022 సెప్టెంబరులో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి వెళ్లారు. తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఈసారి చికిత్సకు వ్యాధి లొంగదని, మరణం తప్పదని వైద్యులు నిర్ధారించారు. హర్షవర్ధన్ భయపడలేదు. విషయం బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. తను మరణించాక మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ దేశ చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకునేందుకు ఒక లాయర్ను పెట్టుకున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో తరచూ బంధువులకు వీడియోకాల్ చేసి మాట్లాడేవాడు. కొందరు స్నేహితులను ఇంటికి కూడా పిలిపించుకున్నాడు. మార్చి 24న కన్నుమూశాడు.
నగరంలో తుది వీడ్కోలు...
హర్షవర్ధన్ మృతదేహం బుధవారం ఉదయం ఖమ్మంలోని అతని ఇంటికి చేరింది. తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బాగుంటే మే 21న హర్షవర్ధన్ ఇండియా రావాల్సి ఉంది. ఆ నెలలో తమ్ముడు అఖిల్ వివాహం ఉంది. అందరూ సంతోషంగా గడపవచ్చు అనుకున్నారు. కానీ ఇంతలోనే కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మేడిగడ్డపై పీటముడి!
మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. -
నెలాఖరులోగా కొత్త వీసీలు
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. -
ఏఐతో ఎంచక్కా వైద్యం
డయాబెటిక్ రెటీనోపతి.. కంటిచూపును శాశ్వతంగా దెబ్బతీసే వ్యాధి. మధుమేహుల్లో సుమారు 8-10 శాతం మంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
తియ్యటి జొన్న.. ఇథనాల్లో మిన్న!
తెల్ల, పచ్చ జొన్నలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజలు ఆహారంలో వాటిని భాగం చేసుకుంటారు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో రకం జొన్న పంట సాగుపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
వేధించాడని జైలుశిక్ష... పెళ్లి చేసుకున్నాడని విముక్తి
ప్రేమ పేరిట ఓ అమ్మాయిని వేధించిన యువకుడికి కింది కోర్టు రెండున్నరేళ్ల శిక్ష విధిస్తే, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు దాన్ని 3నెలలకు తగ్గించింది. -
సుంకం చెల్లించని మద్యం స్వాధీనంలో రికార్డు!
లోక్సభ ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్)తో పాటు ఇతర మాదకద్రవ్యాల స్వాధీనంలో తెలంగాణ ఆబ్కారీశాఖ రికార్డు సృష్టించింది. -
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలి
విద్యుత్ సంస్థల్లో గతంలో ఇచ్చిన పదోన్నతులను సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. -
కేయూలో తాత్కాలిక అధ్యాపకుల ఆందోళన
కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తాత్కాలిక అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 70 మంది అధ్యాపకులు ఒక్కసారిగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు ఆయన్ను కాసేపు గదిలో బంధించారు. -
45% ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను పీఆర్టీయూ తెలంగాణ సంఘం కోరింది. -
పైలట్ శిక్షణ ఇవ్వడంలో జాప్యం.. అకాడమీకి జరిమానా
పూర్తి ఫీజు వసూలు చేసి పైలట్ శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేసిన ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ లిమిటెడ్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
తడిసిన ధాన్యం.. కర్షకుడి దైన్యం
అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హనుమకొండ, వరంగల్లో మూడు రోజుల క్రితం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. -
15% స్థానికేతర కోటాపై సందిగ్ధత
ఏపీలో అమలు చేస్తున్న 15% స్థానికేతర(ఓపెన్) కోటాపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత విడుదల చేసే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లకు 15% కోటా ఉండదని ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. -
ఎన్నికల విధుల వేతనాల్లో వ్యత్యాసాలు తొలగించాలి
లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు అందించే వేతనాల్లో వ్యత్యాసాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు