హైదరాబాద్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గే అవకాశం
ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఈ ముత్యాల నగరం చుట్టూ రైలుమార్గం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త ప్రతిపాదన కార్యరూపందాల్చితే మహర్దశ
ఈనాడు, హైదరాబాద్: ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఈ ముత్యాల నగరం చుట్టూ రైలుమార్గం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సుమారు రూ.15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ప్రతిపాదిత అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్లో రవాణా అధారిత అభివృద్ధికి చోదక శక్తి లభిస్తుంది. తెలంగాణకు 563.5 కి.మీ. కొత్త మార్గం ఒనగూరుతుంది. ఇప్పటివరకు రైలుమార్గం లేని చిట్యాల వంటి పట్టణాలకు కొత్తగా రైళ్లు అందుబాటులోకి తేవచ్చు. ముఖ్యంగా నగరంలోని రైల్వేస్టేషన్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కొత్తగా మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు లభిస్తుంది.
ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది...
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. నగరంలోకి వస్తున్న రైళ్లు సిగ్నల్ కోసం శివారు ప్రాంతాల్లో చాలాసేపు ఎదురుచూస్తున్నాయి. దీంతో చాలామంది ప్రయాణికులు అక్కడే రైళ్లే దిగి ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు చేరాల్సి వస్తోంది. అవుటర్ రింగ్ రైలు మార్గం సాకారమైతే... గూడ్సు, ప్రయాణికుల రైళ్లను హైదరాబాద్కు 50-60 కిమీ దూరం నుంచే మళ్లించవచ్చు. ఉదాహరణకు మిర్యాలగూడ నుంచి సిమెంటుతో వచ్చే గూడ్సు బండ్లు హైదరాబాద్ మీదుగా బెంగళూరు, ముంబయి వైపు వెళుతుంటాయి. వీటి కారణంగా ప్రయాణికుల రైళ్ల సమయం ప్రభావితం అవుతోంది. అవుటర్ రింగ్ రైలు మార్గం నిర్మిస్తే అవి చిట్యాల నుంచి వెళ్లిపోతాయి. బొగ్గు, చమురు, ఆహారధాన్యాలు... ఇలా అనేక రకాల గూడ్సు బండ్లతోపాటు కొన్ని ప్రయాణికుల రైళ్లను హైదరాబాద్లోకి రాకుండానే మళ్లించొచ్చు. ముంబయి, భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే కోణార్క్ ఎక్స్ప్రెస్ లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా వెళుతుంది. మహబూబ్నగర్-విశాఖపట్నం ప్రత్యేక రైలు కాచిగూడ, మల్కాజిగిరి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇలాంటి రైళ్లనూ శివార్ల నుంచే పంపించొచ్చు.
లాజిస్టిక్ హబ్గానూ ప్రగతి
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు... విజయవాడ, ముంబయి, కర్నూలు, వికారాబాద్, మెదక్, కరీంనగర్ ప్రధాన రహదారులను అనుసంధానిస్తుంది. ఆయా జంక్షన్లు లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి అయ్యేందుకు, అక్కడ కార్గో టెర్మినళ్లు నిర్మించడానికి అవకాశం ఉంటుంది.
ట్రాక్ సామర్థ్యమూ పెరిగే అవకాశం
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సెక్షన్లను బట్టి ట్రాక్ సామర్థ్యం 80, 100, 110, 130 కి.మీ. వరకే ఉంది. వందేభారత్ రైళ్లకు 180 కి.మీ. వేగ సామర్థ్యమున్నా ట్రాక్ తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో 130 కి.మీ. వేగానికే పరిమితం అవుతున్నాయి. అవుటర్ రింగ్ రైలు మార్గంలో ట్రాక్ను 200 కి.మీ. వేగానికి తట్టుకునేలా నిర్మించే అవకాశముంది.
నిధులు, భూసేకరణే కీలకం
డీపీఆర్కు ఆమోదం లభిస్తే... ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడమే అత్యంత కీలకంగా మారుతుంది. ఈ రైలుమార్గం కొన్నిచోట్ల ఆర్ఆర్ఆర్కు ఆనుకుని, మరికొన్నిచోట్ల దూరంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్కు భూసేకరణ జరుగుతోంది. రైలు మార్గానికి మరోసారి సేకరించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.15 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశమున్నట్లు అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమయానుకూలంగా కేటాయించాలి.
ఎక్కడెక్కడ కలుస్తుందంటే...
ప్రతిపాదిత రీజనల్ రింగ్ రైలు మార్గం... విజయవాడ హైవేలో చిట్యాల వద్ద, వరంగల్ రోడ్డులో రాయగిరి వద్ద, బెంగళూరు రోడ్డు మార్గంలో బూర్గుల వద్ద, ముంబయి మార్గంలో వికారాబాద్ వద్ద, బాసర, నాందేడ్కు వెళ్లే మార్గంలో అక్కన్నపేట వద్ద కలుస్తుంది. ఇవన్నీ హైదరాబాద్కు 30-50 కి.మీ. దూరంలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మేడిగడ్డపై పీటముడి!
మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. -
నెలాఖరులోగా కొత్త వీసీలు
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. -
ఏఐతో ఎంచక్కా వైద్యం
డయాబెటిక్ రెటీనోపతి.. కంటిచూపును శాశ్వతంగా దెబ్బతీసే వ్యాధి. మధుమేహుల్లో సుమారు 8-10 శాతం మంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
తియ్యటి జొన్న.. ఇథనాల్లో మిన్న!
తెల్ల, పచ్చ జొన్నలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజలు ఆహారంలో వాటిని భాగం చేసుకుంటారు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో రకం జొన్న పంట సాగుపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
వేధించాడని జైలుశిక్ష... పెళ్లి చేసుకున్నాడని విముక్తి
ప్రేమ పేరిట ఓ అమ్మాయిని వేధించిన యువకుడికి కింది కోర్టు రెండున్నరేళ్ల శిక్ష విధిస్తే, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు దాన్ని 3నెలలకు తగ్గించింది. -
సుంకం చెల్లించని మద్యం స్వాధీనంలో రికార్డు!
లోక్సభ ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్)తో పాటు ఇతర మాదకద్రవ్యాల స్వాధీనంలో తెలంగాణ ఆబ్కారీశాఖ రికార్డు సృష్టించింది. -
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలి
విద్యుత్ సంస్థల్లో గతంలో ఇచ్చిన పదోన్నతులను సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. -
కేయూలో తాత్కాలిక అధ్యాపకుల ఆందోళన
కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తాత్కాలిక అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 70 మంది అధ్యాపకులు ఒక్కసారిగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు ఆయన్ను కాసేపు గదిలో బంధించారు. -
45% ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను పీఆర్టీయూ తెలంగాణ సంఘం కోరింది. -
పైలట్ శిక్షణ ఇవ్వడంలో జాప్యం.. అకాడమీకి జరిమానా
పూర్తి ఫీజు వసూలు చేసి పైలట్ శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేసిన ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ లిమిటెడ్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
తడిసిన ధాన్యం.. కర్షకుడి దైన్యం
అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హనుమకొండ, వరంగల్లో మూడు రోజుల క్రితం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. -
15% స్థానికేతర కోటాపై సందిగ్ధత
ఏపీలో అమలు చేస్తున్న 15% స్థానికేతర(ఓపెన్) కోటాపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత విడుదల చేసే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లకు 15% కోటా ఉండదని ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. -
ఎన్నికల విధుల వేతనాల్లో వ్యత్యాసాలు తొలగించాలి
లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు అందించే వేతనాల్లో వ్యత్యాసాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు