బండ భారం తగ్గింది
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గించాలని ప్రధాని ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది.
రూ.200 తగ్గిన వంటగ్యాస్ సిలిండర్
‘ఉజ్వల’ కింద 75 లక్షల ఉచిత కనెక్షన్లు
ఆడపడుచులకు రాఖీ కానుకన్న ప్రధాని
ఈనాడు-దిల్లీ, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గించాలని ప్రధాని ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి రానుంది. అలాగే ఉజ్వల పథకం కింద 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాఖీపౌర్ణమి పండగ వేళ వంటగ్యాస్ ధర తగ్గింపు నిర్ణయం ఆడపడుచులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నా సోదరీమణులు అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఆ దేవుణ్ని ఇదే కోరుకొంటున్నా’’ అని ఆయన హిందీలో ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.
హైదరాబాద్లో రూ.955.. వరంగల్లో రూ.970
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్లో ధర రూ.1,155 నుంచి రూ.955కి, వరంగల్లో రూ.1,170 నుంచి రూ.970కి, మహబూబ్నగర్లో రూ.1,158.50 నుంచి రూ.958.50కి తగ్గనుంది. దిల్లీలో రూ.1,103 ధర ఉండగా.. తాజా తగ్గింపుతో బుధవారం నుంచి రూ.903 అవుతుంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.703కే లభించనుంది. సిలిండర్పై వినియోగదారులకు ప్రస్తుతం రూ.40.71 రాయితీ మాత్రమే వస్తోంది. ధర తగ్గింపు నేపథ్యంలో ఎంత వస్తుందన్న అంశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. రెండు మూడు నెలల్లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలపై వంటగ్యాస్ ధరల భారం తగ్గిస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో 1.17 కోట్ల కనెక్షన్లు
తెలంగాణవ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 1.17 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 16.05 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రంగారెడ్డిలో 12.30 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 11.61 లక్షలున్నాయి. అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 6.6 లక్షలు, నారాయణపేట జిల్లాలో 8.6 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.
రూ.7,680 కోట్ల అదనపు భారం: అనురాగ్ ఠాకుర్
తాజా నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వంపై 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.7,680 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 33 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులందరికీ తాజా తగ్గింపు వర్తిస్తుందని చెప్పారు. ఉజ్వల వినియోగదారులకు ఇదివరకే రూ.200 రాయితీ ఇస్తున్నామని, దానికి అదనంగా రూ.200 తగ్గింపు కూడా కలిపి.. వారికి మొత్తం రూ.400 వరకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. 2020-22 మధ్యలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు 303% పెరిగినా దేశంలో మాత్రం ఈ పెరుగుదల 63%కే పరిమితమైందని తెలిపారు. రాబోయే ఎన్నికల కోసమో.. రాజకీయాల కోసమో ఈ నిర్ణయాలు తీసుకోలేదని, అలా చేయాలనుకుంటే చాలా ముందే చేసి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. అయితే, ఈ తగ్గింపు పైప్డ్ గ్యాస్ వినియోగదారులకు వర్తించేదీ.. లేనిదీ మంత్రి స్పష్టత ఇవ్వలేదు.
- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులందరికీ కానుకగా మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడం సంతోషకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మూడేళ్లలో రూ.508.50 పెంపు.. రూ.200 తగ్గింపు
హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,155 ఉండగా.. తాజాగా రూ.200 తగ్గింపుతో రూ.955కి చేరింది. ప్రస్తుతం ధర భారీగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. గడిచిన మూడేళ్లలో పెంచిన రూ.508.50తో పోలిస్తే ఇప్పుడు తగ్గింది (రూ.200).. 40 శాతం మాత్రమే. 2020 సెప్టెంబరులో సిలిండర్ ధర రూ.646.50 మాత్రమే. 2021 సెప్టెంబరులో రూ.937 ఉండగా.. ప్రస్తుతం దాదాపు అదే ధరకు చేరుకుంది. కాగా, గృహావసర సిలిండర్ల ధరను చమురు సంస్థలు చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న రూ.50 చొప్పున పెంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూలో తెల్ల పులి మృత్యువాత
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి మంగళవారం మృత్యువాత పడింది. -
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు
రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో తెలంగాణ సంబురాలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ‘తెలంగాణ నైట్’ పేరిట టొరంటో, మిసిసాగ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహించి, మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
ఏం చేయాలో పాలుపోక.. ఆ కూలీలు అక్కడి నుంచి రైలులో బయలుదేరి మంగళవారం మహబూబాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. -
యాదాద్రి రెండు యూనిట్లలో ట్రయల్రన్
నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ (వైటీపీఎస్) రెండు యూనిట్లలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించారు. -
పలు జిల్లాల్లో ఓ మోస్తరు వాన
పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో 4.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ కన్నుమూత
ప్రత్యేక తెలంగాణ తొలిదశ పోరాటానికి ఊపిరులూదిన ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్(88) అనారోగ్యంతో సోమవారం రాత్రి సికింద్రాబాద్ న్యూబోయిన్పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. -
నేడు టీఎస్సీపీజీఈటీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష (టీఎస్సీపీజీఈటీ) నోటిఫికేషన్ను బుధవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. -
అమెరికా వెళ్లిన మంత్రి పొన్నం
కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచార వ్యవహారాల్లో తీరికలేకుండా గడిపిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఉదయం అమెరికా వెళ్లారు. -
సంక్షిప్త వార్తలు
రైతులు పంటలు కోసిన తర్వాత వరి కొయ్యలను, పంట వ్యర్థాలను కాల్చవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం విజ్ఞప్తి చేశారు. -
దక్కన్ కాలేజీలో కాల్పుల కేసులో నిందితుడికి జైలు శిక్ష సబబే
హైదరాబాద్ దారుసలాంలోని దక్కన్ ఇంజినీరింగ్ కాలేజీలో 2007లో జరిగిన కాల్పుల కేసులో నిందితుడు మహమ్మద్ ఉమీదుల్లాఖాన్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. -
కవిత జ్యుడిషియల్ కస్టడీ 20 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో ఈడీ అభియోగాలపై ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. -
ఆర్టీసీలో అధిక పింఛను చిక్కుముడికి తాత్కాలిక పరిష్కారం
అధిక పింఛను విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తాత్కాలికంగా ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అనుబంధ ఒప్పందం చేస్తేనే మేడిగడ్డ మరమ్మతులు!
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతు పనులు చేపట్టేందుకు.. అనుబంధ ఒప్పందం(సప్లిమెంటరీ అగ్రిమెంట్) చేసుకుంటేనే ముందుకు వస్తామని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొన్నట్లు తెలిసింది. -
హైదరాబాద్-కొచ్చి విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లడానికి సిద్ధమై రన్వేపైకి వచ్చిన ఓ విమానంలో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండున్నర గంటలు ఆలస్యంగా ఈ విమానం కొచ్చికి బయలుదేరింది. -
దోస్త్కు 20 నుంచి వెబ్ ఆప్షన్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)లో విద్యార్థులు ఈనెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. -
ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోనే కుట్రకోణం
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. -
ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి
మనది వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అభివృద్ధి రేటు 7 శాతం అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!