US Elecions: మార్చిలో బైడెన్కు ₹750 కోట్లు.. ట్రంప్నకు ఒక్కరోజే ₹420 కోట్ల విరాళాలు
US Elecions: రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్ గత నెలలో రూ.750 కోట్లు సమీకరించగా.. ట్రంప్ శనివారం జరిగిన ఒక్క కార్యక్రమంలోనే రూ.420 కోట్లు సేకరించడం గమనార్హం.
విల్మింగ్టన్: మార్చిలో 90 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.750 కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి 192 మిలియన్ డాలర్ల నిధులు తమ చేతిలో ఉన్నట్లు శనివారం వెల్లడించింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపునవేనని తెలిపింది.
మార్చి 28న రెడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకూ వీటిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 నాటికి తమ వద్ద ఉన్న 192 మిలియన్ డాలర్ల విరాళాలు ఇప్పటి వరకు ఏ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అందుకోలేదని చెప్పింది. 2023 ఏప్రిల్లో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించినప్పటి నుంచి 16 లక్షల మంది విరాళాలిచ్చినట్లు తెలిపింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లో 10 మిలియన్ డాలర్ల నిధులు అందినట్లు పేర్కొంది.
భారత్ ఎన్నికల్లో జోక్యానికి చైనా ‘ఏఐ’!
ఒక్కరోజే 50.5 మిలియన్ డాలర్లు..
విరాళాల సేకరణలో డెమోక్రాటిక్ పార్టీతో రిపబ్లికన్ పార్టీ పోటీపడుతోంది. శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే 50.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.420 కోట్లు) సమీకరించినట్లు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రచారం బృందం ప్రకటించింది. ఒక కార్యక్రమంలో ఇంతమొత్తం సమీకరించడం ఇదే రికార్డని పేర్కొంది. బైడెన్ బృందం రెడియో సిటీ మ్యూజిక్ హాల్ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలు.
ఈ కార్యక్రమం కంటే ముందు మార్చిలో 65.6 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు ట్రంప్ బృందం ప్రకటించింది. దీంతో త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద 93.1 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నట్లు వెల్లడించింది. ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో విరాళాలిచ్చేందుకు దాతలు ముందుకు రాలేదు. పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ఇతరులకు మద్దతునిచ్చేందుకు మొగ్గుచూపారు. శనివారం నాటి కార్యక్రమంలో దాదాపు 100 మంది విరాళాలిచ్చారు. వీరిలో కొంతమంది బిలియనీర్లు ఉన్నట్లు ఆయన బృందం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.