Court Ruling: విద్యార్థినిని తాకింది 10 సెకన్లేనంటూ.. నిర్దోషిగా తేల్చి..!
లైంగిక వేధింపుల కేసులో బాధితురాలిని 10 సెకన్లే తాకిన కారణంగా నిందితుడిని నిర్దోషిగా తేల్చిందో కోర్టు. ఈ తీర్పుపై ఆ దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడం విశేషం.
రోమ్: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇటలీ (Italy)లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ నివ్వెరపర్చింది. ఈ కేసులో నిందితుడు కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయమే ఆ విద్యార్థిని తాకాడని (Groping) పేర్కొంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఈ తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
రోమ్కు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. ఈ స్కూల్లో కేర్టేకర్ (CareTaker)గా పనిచేస్తున్న 66 ఏళ్ల ఆంటోనియో అవోలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గతేడాది ఏప్రిల్లో ఫిర్యాదు చేసింది. ఆ రోజు తాను స్నేహితురాలితో కలిసి స్కూల్లో మెట్లెక్కుతుండగా.. కేర్టేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది. తన వెనుక భాగంపై చేతులతో తడిమి.. తన లోదుస్తులను కిందకు లాగేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలిపింది. ఆ తర్వాత తనను పైకెత్తాడని.. తాను భయపడిపోవడంతో జోక్ చేశానంటూ కేర్టేకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది.
- ఇదీ చదవండి: తెగిన తలను తిరిగి అతికించారు
దీంతో పోలీసులు ఆంటోనియోపై కేసు నమోదు చేశారు. దీనిపై స్థానిక కోర్టులో విచారణ జరగ్గా.. ఆ విద్యార్థినిని తాను తాకడం నిజమేనని అతడు అంగీకరించాడు. అయితే తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు తెలిపాడు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
‘‘కామవాంఛతో తాను ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా చేసినట్లు నిందితుడు చెప్పిన వాదనను మేం అంగీకరిస్తున్నాం. అంతేగాక.. బాలికను అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు. కాబట్టి దీన్ని నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించిన కోర్టు.. అతడిపై అభియోగాలను కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
పెద్దఎత్తున నిరసనలతో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అట్టుడికింది. విద్యుత్ బిల్లులపై అధిక పన్నులు, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారిపై భద్రతా బలగాలు అణచివేతకు దిగాయి. -
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
సిబ్బంది నిర్లక్ష్యం.. అప్పటికే తీరని దుఖంలో ఉన్న ఓ కుటుంబాన్ని మరింత ఆవేదనలోకి నెట్టింది. -
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 300 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.