Donald Trump: ‘ట్రూత్’ను మస్క్కు అమ్మాలనుకొన్న ట్రంప్..?
ట్రంప్ సోషల్ మీడియా వేదికను మస్క్కు అమ్మేయాలనుకొన్నారంటూ వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై ఆయన ప్రతినిధి వెటకారంగా స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ను ఒక దశలో బిలియనీర్ మస్క్ (Musk)కు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని కొనుగోలు చేయాలని ఎక్స్ (ట్విటర్)యజమాని ఎలాన్ మస్క్ను కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు కథనంలో పేర్కొంది. కానీ, చివరికి ఇదంతా తప్పంటూ ట్రంప్ ప్రతినిధి ఆ పత్రికపైనే సెటైర్లు వేశారు.
వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారం గతేడాది వేసవిలో ట్రంప్, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య రాజకీయాలు, వ్యాపారాలు సహా చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత ట్రంప్ తన సలహాదారులతో మాట్లాడుతూ చర్చలు విఫలమైనా సరే.. మస్క్ ట్రూత్ను కొనుగోలు చేయాలి అని వ్యాఖ్యానించినట్లు తెలిసిందని కథనంలో పేర్కొంది.
ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పామ్ బీచ్ రిసార్ట్లో రిపబ్లికన్ పార్టీ సభ్యులతో డొనాల్డ్ ట్రంప్ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా వారి మధ్య ట్రూత్ డీల్, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది. కానీ, దీనిని మస్క్ తోసిపుచ్చారు. తాను ఆ సమావేశానికి వెళ్లలేదని చెప్పారు. మరో వైపు ట్రంప్ మాట్లాడుతూ మీటింగ్ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘మస్క్ నాకు చాలా ఏళ్లుగా మంచి మిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతడికి చాలా సాయం చేశాను. విద్యుత్తు కార్లు వంటి అంశాల్లో చిన్న అభిప్రాయభేదాలున్నాయి’’ అని పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ ప్రతినిధి షాన్నన్ డెవిన్ మాట్లాడుతూ ‘‘వాస్తవంగా మేం విన్న దానిప్రకారం ట్రంప్, మస్క్ వాషింగ్టన్ పోస్టును కొనుగోలు చేయడంపై చర్చించారు. కానీ, దానికి ఎలాంటి విలువ లేదని నిర్ణయించి వదిలేశారు’’ అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు.
హిందూ మహా సముద్రంలో నౌక హైజాక్..
2022 నుంచి ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో ‘డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్’లో విలీనానికి యత్నిస్తున్నా.. చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇటీవలే అమెరికా ఎస్ఈసీ దీని విలీన ఒప్పందానికి ఆమోదముద్ర వేయడం ట్రంప్నకు ఊరటనిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
Russia: ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాడనన్న ఆరోపణలతో ఓ ‘ఏజెంట్’ను రష్యా హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. -
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
జాబిల్లిపై ఖనిజాల గుట్టు విప్పేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలోభాగంగా చాంగే-6ను నేడు ప్రయోగించింది. -
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం