నాటోలోకి స్వీడన్
అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది.
32వ సభ్య దేశంగా చేరిక
ఉక్రెయిన్ను ఇప్పుడే చేర్చుకోలేమన్న కూటమి
లిథువేనియాలో శిఖరాగ్ర భేటీ
విల్నియస్ (లిథువేనియా): అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది. మరోవైపు నాటోలో చేరాలని ఉవ్విళ్లూరుతున్న ఉక్రెయిన్కు చుక్కెదురైంది. ఆ దేశాన్ని నాటోలో చేర్చుకుంటాంగానీ ఇప్పట్లో కాదని నాటో తేల్చి చెప్పింది. ‘నాటోలో ఉక్రెయిన్ కచ్చితంగా సభ్యురాలు అవుతుందని పునరుద్ఘాటిస్తున్నాం. అందుకోసం కొన్ని విషయాల్లో మినహాయింపులూ ఇస్తాం. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం’ అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ తెలిపారు. నాటో నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు. నాటోలో తమ చేరికకు సమయాన్ని నిర్దేశించకపోవడాన్ని అనుచిత నిర్ణయంగా అభివర్ణించారు.
లిథువేనియాలో జరుగుతున్న నాటో దేశాధినేతల రెండ్రోజుల సమావేశంలో తొలి రోజైన మంగళవారం స్వీడన్ చేరికకు ఒప్పందం కుదిరింది. ఇన్నాళ్లూ ఆ దేశ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న టర్కీ, హంగరీలు మనసు మార్చుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశానంతరం ఆయా దేశాల అధ్యక్షులు స్వీడన్కు పచ్చజెండా ఊపారు. ఎఫ్-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో టర్కీకి సభ్యత్వంపై జో బైడెన్ నుంచి మద్దతు లభించింది. ఇక ఉక్రెయిన్ చేరికకూ అంగీకరించినా అది ఎప్పుడనేది తేల్చలేదు. కేవలం సభ్యత్వం ఇవ్వడం కోసం రోడ్మ్యాప్ తయారు చేస్తామని నాటో పేర్కొంది. అయితే దానికెలాంటి గడువూ నిర్ణయించకపోవడం గమనార్హం. దీనిపై జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటో నిర్ణయాన్ని అర్థం లేనిదిగా అభివర్ణించారు. ‘మిత్రులకు మేం ఎంతో విలువిస్తాం. అదే సమయంలో ఉక్రెయిన్ను వారు గౌరవించాలి. మా సభ్యత్వానికి సంబంధించిగానీ, ఆహ్వానానికిగానీ ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడమనేది అసంబద్ధమైంది. అనిశ్చితి అనేది బలహీనత. దీనిపై సదస్సులో బహిరంగంగానే మాట్లాడతా’ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. బుధవారం నాటో సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. బైడెన్ తదితర నాయకులతోనూ సమావేశమవుతారు. ఆయనను బుజ్జగించడానికి నాటో-ఉక్రెయిన్ మండలి ఏర్పాటు చేసి, యుద్ధంలో ఉక్రెయిన్ అవసరాలను తీర్చడానికి సాయం చేస్తామని ప్రకటించే అవకాశాలున్నాయి.
రక్షణ వ్యూహం పునర్వ్యవస్థీకరణ!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో రక్షణ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని మంగళవారం కూటమి దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఎదురైన అతి పెద్ద సవాలును ఎదుర్కోవడంతోపాటు రష్యా తమ ప్రాంతంపై దాడి చేస్తే గట్టిగా స్పందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బైడెన్తో నాటో కూటమి దేశాధినేతలు చర్చించారు. 31 సభ్యదేశాలు ఆర్కిటిక్, బాల్టిక్ సముద్ర ప్రాంతాలు, ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్, మధ్యధరా, నల్ల సముద్ర ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా ప్రతీకార చర్యకు దిగేలా సిద్ధంగా ఉండాలని వారు తీర్మానించుకున్నారు. ‘యూరో అట్లాంటిక్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగింది. రష్యా, తీవ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉంది. అందుకే కలిసికట్టుగా సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఏ క్షణంలోనైనా ఎటువంటి ముప్పునైనా తిప్పికొట్టేలా సిద్ధంగా ఉండాలని నిర్ణయించాం’ అని నాటో సంయుక్త ప్రకటన వెల్లడించింది.
మూల్యం చెల్లించుకుంటారు: రష్యా
స్వీడన్ను నాటోలో చేర్చుకోవడంపై రష్యా హెచ్చరిక జారీ చేసింది. ‘నాటో విస్తరణవాదమే ప్రస్తుత ఘర్షణకు దారి తీసింది. అయినా తమ తప్పులను ఐరోపా దేశాలు గుర్తించడం లేదు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వమిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐరోపా భద్రతకే అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
పెద్దఎత్తున నిరసనలతో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అట్టుడికింది. విద్యుత్ బిల్లులపై అధిక పన్నులు, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారిపై భద్రతా బలగాలు అణచివేతకు దిగాయి. -
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
సిబ్బంది నిర్లక్ష్యం.. అప్పటికే తీరని దుఖంలో ఉన్న ఓ కుటుంబాన్ని మరింత ఆవేదనలోకి నెట్టింది. -
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 300 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్