కెనడా అడుగు ఎటో!
భారత్, కెనడాల మధ్య వివాదాస్పదంగా మారిన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు ఎటు దారితీస్తుంది? నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తముందని ఆరోపిస్తున్న కెనడా తద్వారా ఏం సాధించగలుగుతుంది? ఈ కేసును ఎంతదాకా లాగగలదు? చట్టప్రకారం కెనడా ఏం చేయగలుగుతుంది?.. ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు.
నిజ్జర్ హత్య కేసులో పలు సందేహాలు
భీష్మిస్తుందా.. పట్టు సడలిస్తుందా..
భారత్, కెనడాల మధ్య వివాదాస్పదంగా మారిన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు ఎటు దారితీస్తుంది? నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తముందని ఆరోపిస్తున్న కెనడా తద్వారా ఏం సాధించగలుగుతుంది? ఈ కేసును ఎంతదాకా లాగగలదు? చట్టప్రకారం కెనడా ఏం చేయగలుగుతుంది?.. ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు. ‘మా పౌరుడైన హర్దీప్సింగ్ నిజ్జర్ను మా దేశంలోనే ఇతరులు వచ్చి కాల్చి చంపటం అంటే మా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే’ అన్నది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ! ఈ హత్యలో భారత ప్రభుత్వ పాత్ర ఉందని ఆయన చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి. అంతర్జాతీయ చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందనేది ట్రూడో పరోక్షంగా చెబుతున్న మాట. అంతా అనుసరిస్తూ వస్తున్న అంతర్జాతీయ చట్టం ప్రకారం ఏ దేశం కూడా మరో దేశంలోకి వారి అనుమతి లేకుండా ఏజెంట్లను పంపించకూడదు. అన్ని దేశాలూ ఇతర దేశాల రాజకీయ స్వేచ్ఛను, భౌగోళిక సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. నిజ్జర్ కేసులో తమ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయడమే కాకుండా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించినట్లు కెనడా చూపించే అవకాశం ఉంది. కానీ ఇలాంటి సందర్భాల్లో ఆత్మరక్షణ అనేది- ఆరోపణలకు గురైన దేశాలు చెబుతున్న కారణం!
ఆ రెండు సందర్భాల్లో...
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ఇరాక్లో ఇరాన్ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమాని డ్రోన్ దాడిలో చనిపోయారు. అలాగే బరాక్ ఒబామా హయాంలో పాకిస్థాన్లో ఒసామాబిన్ లాడెన్ను అమెరికా ప్రత్యేక ఆపరేషన్లో మట్టుపెట్టింది. ఈ రెండు సందర్భాల్లోనూ చెప్పిన కారణం- ఆత్మరక్షణే! పైగా లాడెన్ను చంపిన ఘటనలో కెనడా పాత్రధారి! ఆ సంఘటనను కెనడా అధినేతలు ప్రత్యక్షంగా తిలకించారు. వాటికి అమెరికాను ఎవరూ నిలదీయలేదు. కేసు వేయలేదు. నిజ్జర్ విషయంలో భారత్ అలాంటి ఆత్మరక్షణ వాదన కూడా చేయటం లేదు. ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. నిజ్జర్ ఖలిస్థాన్ ఉగ్రవాది అనే సంగతిని చెబుతూనే... నేర గ్యాంగులు, కాల్పులు కెనడాలో పెరిగిపోయాయని, క్షీణించిన శాంతిభద్రతల కారణంగానే నిజ్జర్ చనిపోయాడని భారత్ ప్రత్యారోపించింది. భారత్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు బహిరంగ పర్చటానికి కెనడా వెనకంజ వేస్తుండటం గమనార్హం. కెనడాలోని దౌత్యవేత్తల మధ్య సమాచారం ఆధారంగా నిఘా వర్గాలు ఒక నిర్దారణకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా కెనడా నిఘా సంస్థలు కాకుండా దాని మిత్రదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాల నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. అదే నిజమైతే భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టినట్లు, వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు అవుతుంది. అది మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది.
మూడు మార్గాలు
ఈ కేసులో కెనడా ముందు మూడు మార్గాలున్నాయన్నది నిపుణుల మాట! 1) భారత పాత్రపై మరింత బలమైన సాక్ష్యం లభిస్తే ఐక్యరాజ్యసమితి న్యాయవిభాగమైన అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టడం మొదటి మార్గం. అదంత సులభం కాదు. ఎందుకంటే కామన్వెల్త్ దేశాల మధ్య వివాదాలపై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లకూడదనే ఓ ఒప్పందం ఉంది. దీనిపై భారత్, కెనడా సంతకాలు చేశాయి. భారత్ అంగీకరిస్తేనే కెనడా ముందడుగు వేయగలుగుతుంది. దానికి అవకాశం తక్కువ. 2) ఐరాస మానవ హక్కుల కమిటీ ముందుకు వెళ్లటం కెనడా ముందున్న రెండో మార్గం. అది న్యాయపరమైన కేసుగా నిలవదు. కమిటీ ఇచ్చే తీర్పు- న్యాయస్థానం తీర్పులాంటి చట్టబద్ధమైనదేమీ కాదు. 3) భారత్తో ద్వైపాక్షికంగా చర్చించుకోవటం మూడో మార్గం. సరైన సాక్ష్యాలను చూపించి, భారత్తో చర్చించి, ఇక ముందు ఇలాంటివి జరగకుండా హామీ తీసుకోవటం.. మరేదైనా దౌత్యపరమైన ప్రయోజనాలు పొందటం కెనడా ముందున్న మంచి అవకాశమని ఆ దేశానికే చెందిన అంతర్జాతీయ క్రిమినల్ న్యాయవాది అమందా గహ్రేమని అభిప్రాయపడటం గమనార్హం. ‘‘బహుశా భవిష్యత్తులో మరే దేశం ముందూ చులకన కాకుండా ఉండటానికైనా కెనడా దీన్ని అంతర్జాతీయంగా వివాదం చేయాలనుకొంటూ ఉండొచ్చు. పట్టుదలతో దీనిపై ముందుకు వెళుతుందా ఇక్కడితో వదిలేస్తుందా అనేది కొద్దిరోజుల్లో తేలిపోతుంది. వారి స్పందనలు తగ్గితే వివాదం సద్దుమణిగినట్లే! భారత్తో చర్చల ద్వారా సర్దుకోవటానికి కెనడా సిద్ధమవుతున్నట్లే! అలాకాకుండా పదేపదే సాక్ష్యాల గురించి మాట్లాడితే దీన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నట్లే!’’ అని యూకేలో అంతర్జాతీయ న్యాయశాస్త్ర ఆచార్యుడు మార్కో మిలనోవిక్ వ్యాఖ్యానించారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
Israel-Hamas: ఒకవైపు బందీల విడుదల కొనసాగుతుండగా.. తమ చెరలో ఉన్న ఓ చిన్నారి మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. -
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయ వ్యక్తిపై తాజాగా అమెరికా(USA) అభియోగాలు మోపింది. -
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
Henry Kissinger: ప్రముఖ దౌత్య వేత్త అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!
-
TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి
-
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్