భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించాం
భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యుల(42)తో సహా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా వెల్లడించింది.
కెనడా అధికారిక ప్రకటన
భారత వైఖరి లక్షల మంది జీవితాల్ని దుర్భరం చేస్తుంది: ట్రూడో
ఒట్టావా, దిల్లీ : భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యుల(42)తో సహా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా వెల్లడించింది. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే దిల్లీలోని కెనడా హైకమిషన్తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు. ‘‘41 మంది దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. అయితే కెనడా అదే తరహాలో స్పందించాలనుకోవడం లేదు. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలనుకుంటోంది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుంది. అలాగే భారత్తో సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి రెండు దేశాల్లోని లక్షల మంది జీవితాలను దుర్భరం చేస్తుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం వ్యాఖ్యానించారు. దౌత్యం ప్రాథమిక సూత్రానికి భిన్నంగా వారు (భారత్) వ్యవహరించారని బ్రాంప్టన్లో విలేకరులతో పేర్కొన్నారు.
‘భారత్లో ఆ నగరాల్లో జాగ్రత్త..’
భారత్లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసి కెనడా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. ‘‘ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. భారత్లో మీడియా, సామాజిక మాద్యమాల్లో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కెనడా-వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి. కెనడియన్లపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చు. అందువల్ల దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో మీరు (కెనడియన్లు) జాగ్రత్తగా ఉండండి. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. బెంగళూరు, చండీగఢ్, ముంబయిల్లోనూ అప్రమత్తంగా ఉండండి’’ అని కెనడా తన అడ్వైజరీలో పేర్కొంది.
కెనడాకు దీటుగా బదులిచ్చిన భారత్
భారత అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కెనడా అక్కసు వెళ్లగక్కడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీటుగా బదులిచ్చింది. ‘‘భారత్లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
17,000 వీసా దరఖాస్తులపై ప్రభావం..?
తన దౌత్య సిబ్బందిని తగ్గించుకున్న నేపథ్యంలో బెంగళూరు, ముంబయి, చండీగఢ్ నగరాల్లోని కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. ఈ పరిణామం ప్రభావం దాదాపు 17 వేలకు పైగా వీసా దరఖాస్తులపై ఉంటుందని అంచనా. ఎవరికైనా కాన్సులర్ సహాయం కావాలంటే దిల్లీలోని కెనడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.