కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు

కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి.

Published : 28 Apr 2024 04:57 IST

20 మంది సైనికుల మృతి

పినోమ్‌ పెన్‌: కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని హున్‌ మనేట్‌.. ఫేస్‌బుక్‌లో తెలిపారు. సంఘటన కంపొంగ్‌ స్పీ ప్రావిన్స్‌లో జరిగిందని పేర్కొన్నారు. పేలుడుకు కారణాలను వెల్లడించలేదు. సైనిక స్థావరంలోని గోడౌన్లు.. ఇతర కార్యాలయాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సైనిక వాహనాలకూ నష్టం కలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు