అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు.
ముగ్గురు భారత సంతతి మహిళల మృతి
న్యూయార్క్: అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారంతా గుజరాత్లోని ఆణంద్ జిల్లాకు చెందినవారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులను రేఖా దిలీప్ పటేల్, సంగీతా భవ్నేశ్ పటేల్, మనీశా రాజేంద్ర పటేల్గా గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం స్టాంటన్ బ్రిడ్జ్ రోడ్పై ఈ ఘటన జరిగిందని ఫాక్స్ కరోలినా వార్తా సంస్థ వెల్లడించింది. ‘‘వారు ప్రయాణిస్తున్న వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. దాంతో అదుపుతప్పిన ఎస్యూవీ.. రహదారిపై పల్టీలు కొట్టి.. 20 అడుగుల ఎత్తు గాల్లోకి లేచి చెట్లపైకి ఎగిరిపడి ఇరుక్కుపోయింది’’ అని అధికారులు తెలిపారు. దీనిపై వెంటనే సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. అతని పరిస్థితి ఎలా ఉందో తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.