Israel: అంతర్జాతీయ శాంతిభద్రతలకు ఇజ్రాయెల్ ముప్పు: ఇరాన్ అధ్యక్షుడు
గాజాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఆరోపించారు. గాజా అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు అని విమర్శించారు.
టెహ్రాన్: గాజా (Gaza) సమస్య.. మానవత్వానికి, న్యాయానికి సంబంధించిన అంశమని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రిక్స్ సమావేశంలో ఇబ్రహీం వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గాజాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇజ్రాయెలే కారణమని ఆరోపించారు.
‘‘ఇజ్రాయెల్, ఆ దేశానికి మద్దతిస్తున్నవారంతా మానవత్వాన్ని, విలువల్ని, హక్కులను ఉల్లంఘిస్తున్నారు. గాజాలో వాస్తవ పరిస్థితుల్ని దాచిపెట్టి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల అభిప్రాయాలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాజాలో మారణకాండకు అమెరికా మద్దతున్న ఇజ్రాయెలే బాధ్యత వహించాలి’’అని ఇబ్రహీం ధ్వజమెత్తారు. గాజాలోని ఆస్పత్రుల్లో దాడులు చేస్తూ మహిళలు, చిన్నారులు, వైద్యులు, పాత్రికేయుల్ని కూడా హతమారుస్తున్న ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా, సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిన అవసరముందన్నారు.
అణ్వస్త్రాలు, రసాయన ఆయుధాలు కలిగి ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతీయంగానే కాదు.. అంతర్జాతీయ శాంతి భద్రతలకూ ముప్పేనని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నిలువరించడంలో ఐరాస భద్రత మండలి విఫలమైందని, బ్రిక్స్ దేశాలన్నీ కలిసికట్టుగా గాజాపై దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు కొత్త ఒప్పందం!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. -
డొనాల్డ్ ట్రంప్ దోషే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. -
పశ్చిమాసియాలో వైమానిక గర్జనలు
యుద్ధవిమానాల గర్జనలతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. సెంట్రల్ గాజాలో శుక్రవారం ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. -
అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా బృహత్
అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ - 2024 పోటీల్లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ విజేతగా నిలిచాడు. -
రష్యాపైకి అమెరికా తయారీ ఆయుధాలు
ఖర్కివ్ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రష్యా భూభాగంలోకి ‘అమెరికా తయారీ ఆయుధాలు’ వినియోగించేందుకు ఉక్రెయిన్ను అనుమతించాలని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. -
మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు
దక్షిణ కొరియాపై ముందస్తు దాడి జరిపే సత్తా తమకుందని చాటడానికి.. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. -
అమెరికా కాంగ్రెస్కు భారత సంతతి వైద్యుడి పోటీ
భారత్లోని చెన్నై నగరంలో జన్మించిన అమెరికా వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా కాన్సస్ రాష్ట్రంలోని మూడో నియోజకవర్గం నుంచి అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు పోటీచేస్తున్నారు.