Modi: నమ్మిన వాళ్లే సాయం చేయలేదు: అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని మోదీ ఆక్షేపణ
సోమవారం పపువా న్యూ గినియా (Papua New Guinea) ప్రధానితో పాటు పాల్గొన్న సదస్సులో అభివృద్ధి చెందిన దేశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. వాటిపై తనకున్న అసంతృప్తిని బయటపెట్టారు.
పోర్ట్ మోరెస్బీ: అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు అవసరకాలంలో అండగా నిలవలేదని వ్యాఖ్యానించారు. సోమవారం పపువా న్యూ గినియా(Papua New Guinea) పర్యటనలో ఉన్న ఆయన ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.
‘గ్లోబల్ సౌత్(పేద దేశాలు)పై కొవిడ్ ప్రభావం తీవ్రంగా పడింది. వాతావరణ మార్పులు, ఆకలి, పేదరికం, వైద్యపరమైన సమస్యలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనం, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఆ ప్రభావాన్ని మనమంతా అనుభవిస్తున్నాం. ఇంకా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ క్లిష్టసమయంలో మేం నమ్మినవారు మాతో నిలబడలేదు. కానీ, భారత్ మాత్రం పసిఫిక్ ప్రాంత దేశాలకు అండగా నిలవడం పట్ల సంతోషంగా ఉన్నాను’అని మోదీ అన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా పసిఫిక్ దేశాలతో తన అనుభవాలను, సామర్థ్యాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. తన దృష్టిలో పసిఫిక్ ద్వీప దేశాలు.. మహాసముద్రం పరిధిలోని పెద్ద దేశాలని, చిన్నద్వీపదేశాలు ఏమాత్రం కాదని వ్యాఖ్యానించారు.
ఈ సదస్సులో గినియా ప్రధాని జేమ్స్ మరాపే(James Marape) మాట్లాడుతూ.. ప్రపంచ వేదికపై భారత్ నాయకత్వాన్ని కొనియాడారు. అలాగే మనదేశం అందిస్తోన్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘అగ్రదేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యాం. మీరు గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై మేం మీకు వెన్నంటి ఉంటాం’అని భారత్తో కలిసి నడవడం పట్ల ఆసక్తి చూపించారు. తమ మధ్య ఫలవంతమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ఇరుదేశాల నేతల వెల్లడించారు. అలాగే తమిళ ప్రఖ్యాత ‘తిరుక్కురల్’గ్రంథానికి గినియా స్థానిక భాషలో చేసిన అనువాదాన్ని ఈ ఇద్దరు నేతలు ఆవిష్కరించారు.
ఇదిలా ఉంటే.. అంతకుమందు పపువా న్యూ గినియాకు చేరుకున్న ప్రధానికి అపూర్వ స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. జేమ్స్ మరాపే.. మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది. పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
Russia: ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాడనన్న ఆరోపణలతో ఓ ‘ఏజెంట్’ను రష్యా హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. -
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
జాబిల్లిపై ఖనిజాల గుట్టు విప్పేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలోభాగంగా చాంగే-6ను నేడు ప్రయోగించింది. -
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్