Ukraine Crisis: పుతిన్తో భేటీ కావాలనుకుంటున్నా..: పోప్
ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం కోరారు. ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన రష్యాలోని ఆర్థోడాక్స్ చర్చరి పుతిన్కు ఆల్టర్ బాయ్ వలే
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం కోరారు. ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన రష్యాలోని ఆర్థడాక్స్ చర్చిని పుతిన్కు ఆల్టర్ బాయ్ వలే పనిచేయకూడదని హితవు పలికారు. కొరియర్ డెల్లాసెరా అనే న్యూస్పేపర్తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలుకాగానే పోప్ ఫ్రాన్సిస్ రష్యా దౌత్యకార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అదే సమయంలో తాను మాస్కోకు రావాలనుకుంటున్న విషయాన్ని క్రెమ్లిన్ నేతకు తెలియజేయాలనే సందేశం పంపాన్నారు. కానీ, ఇప్పటి వరకు దానికి ఎటువంటి ప్రతిస్పందన రాలేదని పేర్కొన్నారు. పుతిన్ అసలు తనతో భేటీ కావాలని కోరుకోవడంలేదన్న భయం తనలో ఉందని వెల్లడించారు.
ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్కు పర్యటనపై కూడా పోప్ స్పందించారు. ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. ‘‘ముందు మాస్కోకు వెళ్లనివ్వండి. పుతిన్తో భేటీ కానివ్వండి. తొలుత నేను ఏమి చేయగలనో అవి చేయనీయండి. పుతిన్ మాత్రమే దీని పరిష్కారానికి అవకాశం ఇవ్వగలరు’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి గత నెలలో పోప్ మాట్లాడుతూ కీవ్కు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఎన్నడూ రష్యా లేదా పుతిన్ గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల పోప్ రష్యాలోని ఆర్థడాక్స్ చర్చ్ అధిపతి పాట్రియార్క్ కిరిల్తో దాదాపు 20 నిమిషాలపాటు జూమ్ కాల్లో మాట్లాడారు. కిరిల్ రష్యా యుద్ధానికి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. పుతిన్ ఆల్టర్ బాయ్ వలే కిరల్ మారకూడదని ఈ సందర్భంగా పోప్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
Russia: ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాడనన్న ఆరోపణలతో ఓ ‘ఏజెంట్’ను రష్యా హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. -
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
జాబిల్లిపై ఖనిజాల గుట్టు విప్పేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలోభాగంగా చాంగే-6ను నేడు ప్రయోగించింది. -
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు