Taiwan: గత ఏడాదంతా 15 వేల కేసులొస్తే.. ఇప్పుడు రోజుకు 80 వేల కేసులు..!
2021 ఏడాదంతా అక్కడ స్థానికంగా 15 వేల దిగువనే కరోనా కేసులు వచ్చాయి.. ఇప్పుడు రోజు 80 వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. 2020 నుంచి 2021 వరకు 838 మరణాలు సంభవిస్తే.. ఇప్పుడు నిత్యం 40 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అయినా కరోనా ఆంక్షలు సడలిస్తోన్న తైవాన్
తైపీ: 2021 ఏడాదంతా అక్కడ స్థానికంగా 15 వేల దిగువనే కరోనా కేసులు వచ్చాయి.. ఇప్పుడు రోజు 80 వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. 2020 నుంచి 2021 వరకు 838 మరణాలు సంభవిస్తే.. ఇప్పుడు నిత్యం 40 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది తైవాన్ ఎదుర్కొంటోన్న కరోనా పరిస్థితి. కొవిడ్ విషయంలో ముందుజాగ్రత్తగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్న తైవాన్.. ఆంక్షలు సడలించడంతో భారీ స్థాయిలో కొత్త కేసుల్ని చవిచూస్తోంది.
‘వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వైరస్తో మేము జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించలేము. ఇప్పటివరకూ వెలుగుచూసిన కేసుల్లో అధికంగా ఒమిక్రాన్ వేరియంట్నే గుర్తించాం. దీని బారినపడిన 99.7 శాతం మంది అతి స్వల్ప లక్షణాలు కలిగిఉన్నారు లేక లక్షణ రహితంగా ఉన్నారు. ఇది ఒక సంక్షోభం. అలాగే ఒక అవకాశం కూడా. ఇది మమ్మల్ని కొవిడ్ నీడ నుంచి త్వరగా బయటపడేస్తుంది’ అంటూ తైవాన్ అంటువ్యాధుల నిపుణుడు చెన్ చియెన్ జెన్ అన్నారు. రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. ఆ దేశం ఆంక్షలను సడలిస్తోంది. ఇది ‘న్యూ తైవాన్ మోడల్’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త విధానం కింద ప్రజలు క్రమంగా వైరస్తో కలిసి జీవించేలా, ఆర్థిక వ్యవస్థను మూసివేయకుండా ప్రయత్నిస్తోంది. పర్యాటకులను ఆహ్వానించేందుకు కూడా ఆ దేశం సిద్ధంగా ఉంది. 75 నుంచి 80 శాతం మంది మూడో డోసు తీసుకున్న తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం 64 శాతం మంది మూడో డోసు తీసుకున్నారని తెలిపింది.
ప్రస్తుతం తైవాన్లో నిత్యం 40 నుంచి 50 మరణాలు వస్తున్నాయి. 23.5 మిలియన్ల జనాభా కలిగిన తైవాన్లో.. గత ఏడాది 625 మరణాలు సంభవించాయి. 2020 నుంచి గత ఏడాది చివరకు 838 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణాల రేటును 0.1 శాతానికి పరిమితం చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రేటు 0.06 శాతంగా ఉంది. ఇక, వైరస్ కట్టడి, చిన్నారులకు టీకా ఇచ్చే విషయంలో అక్కడి అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్