Omicron: ఒమిక్రాన్ ప్రాణాంతకమే.. మనుషుల్ని చంపేస్తోంది..!
కరోనా కొత్త రకం ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత గత వేరియంట్ల కంటే తక్కువగా ఉందంటూ వస్తోన్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)
ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేం.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
ఇంటర్నెట్డెస్క్: కరోనా కొత్త రకం ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత గత వేరియంట్ల కంటే తక్కువగా ఉందంటూ వస్తోన్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఒమిక్రాన్ను తేలికపాటి వ్యాధి అని చెప్పడంలో అర్థం లేదని.. ఇది కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని హెచ్చరించింది. ఒమిక్రాన్ బాధితులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు.
‘‘డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు (ముఖ్యంగా టీకాలు వేసుకున్న వారిలో) కన్పిస్తున్నప్పటికీ.. దీన్ని తేలికపాటి వ్యాధిగా పరిగణించడం సరైంది కాదు. ఇప్పటికే చాలా దేశాల్లో డెల్టా కంటే ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా కొన్ని దేశాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గత వేరియంట్లలాగే ఒమిక్రాన్ బాధితులు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది కూడా మనుషుల్ని చంపేస్తోంది. నిజం చెప్పాలంటే కేసులు సునామీలా విరుచుకుపడుతున్నాయి. ఇవి యావత్ ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి’’ అని టెడ్రోస్ ప్రపంచాన్ని హెచ్చరించారు.
టీకా అసమానతల వల్లే..
వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతల వల్లే ఎన్నో ప్రాణాలు మహమ్మారికి బలవుతున్నాయని టెడ్రోస్ విచారం వ్యక్తం చేశారు. ‘‘టీకాల వినియోగంలో సంపన్న దేశాల స్వార్థపూరిత చర్యల వల్లే కొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవించేందుకు ఆస్కారం కలిగింది. టీకాల అసమానతలే ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను బలహీనపరుస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలకు కనీస వ్యాక్సిన్ల రక్షణ(ఒక్క డోసు కూడా ఇవ్వకుండా) లేకుండా.. కొన్ని దేశాలు తమ ప్రజలకు బూస్టర్ల మీద బూస్టర్లు ఇచ్చినంత మాత్రాన మహమ్మారిని అంతం చేయలేం. కనీసం 2022లో అయినా దేశాలు పారదర్శకంగా వ్యవహరించాలి. టీకాలను పంచుకోవడంలో సమతుల్యం పాటించాలి. అప్పుడే ఈ వినాశకర కొవిడ్ను ఆపగలం. 2022 మధ్య నాటికి ప్రతి దేశం కనీసం 70శాతం ప్రజలకు టీకాలు అందించాలి’’ అని టెడ్రోస్ సూచించారు.
ఒమిక్రానే చివరిది కాదు..!
ఇక ఒమిక్రాన్.. ఆందోళనకర రకాల్లో చివరి వేరియంట్ అని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్వో కొవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్లు వస్తాయో ఊహించలేమని అన్నారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, వైరస్ నుంచి రక్షణకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. ముఖానికి మాస్క్లు అంటే ముక్కు, నోరు కప్పి ఉంచేలా పెట్టుకోవాలని అన్నారు. అంతేగాని, గడ్డం కిందకు మాస్క్ను వేలాడదీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.