Trump: ఉపాధ్యక్ష అభ్యర్థి అతడేనా..? ఒకే వేదికపై ట్రంప్, వివేక్
తొలి ప్రైమరీ పోరులో విజయంతో మాజీ అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) వర్గం ఫుల్ జోష్లో ఉంది. ఆయనకు మరో నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది.
వాషింగ్టన్: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగిన భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో వేదిక పంచుకున్నారు. ఆ సందర్భంగా వీపీ(ఉపాధ్యక్షుడు).. అంటూ కార్యకర్తలు ఉత్సాహంగా కేకలు వేశారు. అయోవాలో తొలి ప్రైమరీ పోరులో విజయం సాధించిన ట్రంప్.. న్యూ హాంప్షైర్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారం మొత్తం ఇద్దరు నేతలు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు.
కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86% తగ్గుదల
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘అధ్యక్ష రేసులో ఈ వ్యక్తికంటే మెరుగైన ఎంపిక ఇంకోటి లేదు. అందుకే తర్వాతి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్నకు ఓటు వేయాలని మిమ్మల్ని కోరుతున్నాను’ అంటూ ప్రసంగించారు. దీనిపై ఆయనకు ట్రంప్ (Trump) కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఆయన ఆమోదం లభించడం గర్వంగా ఉంది. ఆయన మాతో కలిసి పనిచేస్తారు. చాలాకాలం పాటు మాతో కలిసి ముందుకుసాగుతారు’ అని వెల్లడించారు. అలాగే రామస్వామి(Vivek Ramaswamy) ప్రచారం తీరును ప్రశంసించారు. ఈసందర్భంగా ‘ఉపాధ్యక్షుడు’ అంటూ మద్దతుదారులు పలుమార్లు నినాదాలు చేస్తుంటే.. వారిద్దరూ చిరునవ్వులు చిందించారు. ఆయన తన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉంటారని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడిన వివేక్(Vivek Ramaswamy).. తొలి ప్రైమరీ పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు వచ్చాయి. 51 శాతం ఓటింగ్తో అయోవా చరిత్రలో ట్రంప్ ఎన్నడూ లేనంత మెజారిటీని దక్కించుకున్నారు. ఇతర అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
Russia: ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాడనన్న ఆరోపణలతో ఓ ‘ఏజెంట్’ను రష్యా హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. -
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
జాబిల్లిపై ఖనిజాల గుట్టు విప్పేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలోభాగంగా చాంగే-6ను నేడు ప్రయోగించింది. -
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన