Ukraine Crisis: పిట్టల్లా రాలుతోన్న రష్యా జనరళ్లు.. కారణం అదేనా..?
ఉక్రెయిన్ సేనలు జరుపుతోన్న ప్రతిదాడుల్లో పదుల సంఖ్యలో రష్యా జనరళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోవడం పుతిన్ సేనలకు మింగుడు పడడం లేదు.
అమెరికా మీడియాలో కథనాలు
మాస్కో: ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా.. అదే స్థాయిలో తన సొంత బలగాలను కోల్పోతోంది. ఉక్రెయిన్ సేనలు జరుపుతోన్న ప్రతిదాడుల్లో పదుల సంఖ్యలో రష్యా జనరళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోవడం పుతిన్ సేనలకు మింగుడు పడటం లేదు. గతంలో జరిపిన యుద్ధాల్లో ఎన్నడూ ఈ స్థాయిలో జనరళ్లను రష్యా కోల్పోలేదు. ఇంత కచ్చితంగా సైనిక నాయకత్వాన్ని ఉక్రెయిన్ సేనలు లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికా నిఘా వర్గాలు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా వార్తా పత్రికల్లో కథనాలు వెల్లడయ్యాయి.
ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోన్న వేళ వారు దండయాత్ర చేసే మార్గాలను ముందుగానే గుర్తించడం ఉక్రెయిన్ సేనలకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రష్యా బలగాల కదలికలు, తాత్కాలిక స్థావరాలతోపాటు మొబైల్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్ సేనలకు అమెరికా నిఘావిభాగం ఎప్పటికప్పుడు అందించినట్లు సమాచారం. అమెరికా ఇచ్చిన సమాచారంతోపాటు తమ సొంత నిఘా వ్యవస్థను ఉపయోగించుకొని రష్యా జనరళ్లపై ఉక్రెయిన్ సేనలు ప్రతిదాడులు జరిపాయి. తద్వారా భారీ స్థాయిలో రష్యా సైన్యంతోపాటు వారి జనరళ్లను మట్టుబెట్టడం సాధ్యమయ్యిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా బహిరంగంగా వెల్లడించినప్పటికీ అక్కడి నిఘా విభాగం అధికారులు నుంచి విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొంది.
ఇదిలాఉంటే రష్యా చేస్తోన్న భీకర యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సేనలు భారీ స్థాయిలో రష్యా సైన్యాన్ని మట్టుబెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 12 మంది జనరళ్లను చంపేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అమెరికా నిఘావ్యవస్థ సహకారంతో ఎంతమంది రష్యన్ జనరళ్లను చంపారనే విషయంపై అమెరికా, ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. తాము జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు 24వేల మంది రష్యన్ సైనికులు మరణించగా, వందల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వెయ్యికిపైగా యుద్ధట్యాంకులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్