Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
India-Canada row: ఉగ్రవాదంపై కెనడా ఉదాసీన వైఖరే ప్రస్తుత దౌత్య వివాదానికి కారణమైందని అన్నారు భారత విదేశాంగమంత్రి జైశంకర్. నిజ్జర్ హత్య కేసులో ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే చూపించాలని కెనడాను నిలదీశారు.
వాషింగ్టన్: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (EAM Jaishankar) మరోసారి గట్టిగా బదులిచ్చారు. ఆ ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య అని, దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (India-Canada row)
ఐరాస సర్వసభ్య సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్లిన జైశంకర్.. తాజాగా వాషింగ్టన్లో భారత విలేకరులతో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ - కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలపై ఆయన స్పందించారు. ‘‘నిజ్జర్ (Nijjar) హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు సంబంధించి కెనడా వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంటే దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు. కానీ, కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కదా..!’’ అని జైశంకర్ అన్నారు. ఈ అంశంపై ఇరు దేశాలు ప్రభుత్వాలు చర్చలు జరిపి.. విభేదాలను పరిష్కరించుకోవాల్సి అవసరం ఉందన్నారు.
బ్లింకెన్తో చర్చల్లో నిజ్జర్ అంశం ప్రస్తావనకు వచ్చింది
వారి ఉదాసీన వైఖరే..
‘‘కెనడా ప్రభుత్వంతో భారత్ చాలాకాలంగా సమస్యలు ఎదుర్కొంటోంది. అతివాదం, ఉగ్రవాదంపై వారి ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య. రాజకీయంగా ఉన్న ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో కెనడా అలా వ్యవహరించాల్సి వస్తోంది. భారత్లో నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు. వారిని అప్పగించాలని ఎన్నోసార్లు అభ్యర్థించినా కెనడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో భారత వ్యతిరేక శక్తులు.. కెనడాలో తమ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నాయనేది రహస్యమేమీ కాదు’’ అని జైశంకర్ మండిపడ్డారు.
వాక్ స్వేచ్ఛపై మాకు హితబోధలు అక్కర్లేదు..
‘‘కెనడాలో మా దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. దీన్ని సాధారణ పరిస్థితిగా పరిగణించాలా? మరో దేశానికి ఇలాంటి పరిస్థితే ఎదురైతే.. వారు ఎలా స్పందిస్తారు? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దౌత్యవవేత్తలపై బెదిరింపులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాక్ స్వాతంత్ర్యం గురించి మాకు ఇతరులు నేర్పించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ పేరుతో హింస జరగడం అంటే.. దాన్ని దుర్వినియోగం చేసినట్లే’’ అని జైశంకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
సిబ్బంది నిర్లక్ష్యం.. అప్పటికే తీరని దుఖంలో ఉన్న ఓ కుటుంబాన్ని మరింత ఆవేదనలోకి నెట్టింది. -
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 300 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్