Mystery: చిన్నారుల్లో ‘అంతుచిక్కని’ కాలేయ వ్యాధి..!
కరోనా వైరస్ విజృంభణతో గత రెండేళ్లుగా సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను ఇప్పుడు ఓ అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది.
మూలాలు శోధిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
బెర్లిన్: కరోనా వైరస్ విజృంభణతో గత రెండేళ్లుగా సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను ఇప్పుడు ఓ అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఐరోపా, అమెరికాలో చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న కాలేయ వ్యాధి క్రమంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మిస్టరీ కాలేయ వ్యాధితో ఇప్పటికే ఓ చిన్నారి మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. అయితే, ఇప్పటివరకు ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు తెలియని నేపథ్యంలో వాటి మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ శోధన చేపట్టింది.
ఒకరు మరణం..
‘ఐరోపా, అమెరికాకు చెందిన 12 దేశాల్లోని చిన్నారుల్లో ‘మూలాలు తెలియని కామెర్ల జబ్బు’ వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు 169 కేసులు నమోదయ్యాయి. ఒక నెల వయసు నుంచి 16ఏళ్ల లోపు పిల్లల్లోనే వీటని గుర్తించాం. ఇప్పటివరకు అనారోగ్యం పాలైన మొత్తం బాధిత చిన్నారుల్లో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైంది. వీరిలో ఇటీవలే ఒకరు మరణించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే, ఆ మరణం ఏ దేశంలో చోటుచేసుకుందనే విషయాన్ని డబ్ల్యూహెచ్వో వెల్లడించలేదు.
యూకేలో తొలికేసు..
ఈ మిస్టరీ కాలేయ వ్యాధి కేసును ఏప్రిల్ మొదటి వారంలో తొలుత బ్రిటన్లో గుర్తించారు. ఇప్పటివరకు అక్కడ 114 మంది చిన్నారులు అనారోగ్యం బారినపడ్డారు. ఈనేపథ్యంలో ‘ఈ హెపటైటిస్ కేసులు పెరగడం, ఊహించిన స్థాయికంటే ఎక్కువ కేసులు నమోదుపై స్పష్టత లేదు. అయినప్పటికీ అవి గుర్తించకుండాపోయే అవకాశం కూడా ఉంటుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మరోవైపు ఈ తరహా కేసులు డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్తోపాటు స్పెయిన్లోనూ నమోదైనట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవలే వెల్లడించింది. అమెరికాలోని అలబామాలోనూ ఒకటి నుంచి ఆరేళ్ల వయసు చిన్నారుల్లో ఇటువంటి తీవ్ర కాలేయ కేసులు తొమ్మిది గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యాధిని గుర్తించిన పిల్లల్లో జ్వరం మాత్రం కనిపించలేదు. కొందరిలో ఆస్పత్రి చేరికలు అవసరం అవుతుండగా.. మరికొందరికి ఏకంగా కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
నిపుణులు ఏమంటున్నారు..?
ఈ మిస్టరీ కేసులకు సంబంధించిన సమాచారంపై నిపుణులు ఇప్పటికే అధ్యయనం చేపట్టారు. అయితే, సాధారణ జలుబుకు కారణమైన వైరస్ ఇందుకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ అసలు కారణాలేంటనే విషయంపై పరిశోధన కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అడినోవైరస్ కారణమని భావిస్తున్నప్పటికీ కచ్చితమైన మూలం కోసం దర్యాప్తు కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం నమోదైన కేసుల్లో 74 వాటిల్లో అడినోవైరస్ గుర్తించగా.. మరో 20 మంది చిన్నారులకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ఈ క్రమంలో చిన్నారుల్లో హెపటైటిస్ పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని ఆయా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తూ అప్రమత్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?