CPI Narayana: చాలా కేసులున్నా.. జగన్‌ జోలికి భాజపా ఎందుకు వెళ్లడం లేదు?: సీపీఐ నేత నారాయణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 30 Apr 2024 15:00 IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే మోదీ పతనం ప్రారంభమైనట్లేనని హెచ్చరించారు. పలు కేసుల్లో చాలా ఏళ్లుగా బెయిల్‌పై ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ జోలికి భాజపా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని