Uttamkumar Reddy: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత భారాస మిగలదు: మంత్రి ఉత్తమ్‌

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారాస మిగలదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) విమర్శించారు.

Published : 02 May 2024 15:49 IST

భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) ఆరోపించారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా మోతెలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఓట్ల కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ, అమిత్ షా, నడ్డా పదేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారాస మిగలదని విమర్శించారు.  

Tags :

మరిన్ని